Begin typing your search above and press return to search.

శర్వా.. ఒకేసారి రెండు..

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.

By:  Tupaki Desk   |   12 Jun 2024 4:42 AM GMT
శర్వా.. ఒకేసారి రెండు..
X

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్. తన యాక్టింగ్ తో తక్కువ సమయంలోనే స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. తన కామెడీ టైమింగ్ తో అలరిస్తున్నారు. ఫ్యామిలీ రీజన్స్ తో రెండేళ్ల గ్యాప్ తీసుకున్న శర్వానంద్.. ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు.

2022లో ఒకే ఒక్క జీవితం మూవీతో వచ్చిన శర్వా.. రీసెంట్ గా మనమేతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ అందుకుని దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. సినిమాలో శర్వానంద్ యాక్టింగ్ అదరగొట్టారని రివ్యూలు వచ్చాయి. యమా స్టైలిష్ గా, కొత్తగా కనిపించారని అందరూ చెప్పారు. ఇప్పుడు శర్వా అప్ కమింగ్ మూవీస్ కోసం నెట్టింట చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం శర్వానంద్ తన చేతిలో ఉన్న రెండు సినిమాల కోసం ఒకేసారి పనిచేస్తున్నారని సినీ వర్గాల సమాచారం. ఓ వైపు అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా.. మరోవైపు సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో ఎంటర్టైనర్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. రెండు చిత్రాలను త్వరగా పూర్తి చేసి మరిన్ని సినిమాలు లైన్ లో పెట్టాలని శర్వా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అప్పుడిచ్చిన గ్యాప్ ను ఇప్పుడు కవర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న సినిమా.. రేసింగ్ ఆధారంగా రూపొందుతున్నట్లు ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ల ద్వారా అర్థమవుతోంది. సినిమాలో శర్వా బైక్ రైడర్ గా కనిపించనున్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని గ్రాండ్ గా రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ బ్యానర్ పై శర్వానంద్ నటించిన రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

మరోవైపు, రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న శర్వానంద్ 37వ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ లో శర్వానంద్, సంయుక్త మీనన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ వేరే లెవల్ లో ఉంది. మరి మనమే సినిమాతో మంచి హిట్ అందుకున్న శర్వా.. కొత్త చిత్రాలతో ఎలా అలరిస్తారో చూడాలి.