Begin typing your search above and press return to search.

శర్వా, సంపత్ నంది.. ఆ వార్తలన్నీ తూచ్!

ఫ్యామిలీ ఎంట‌ర్టైనర్ గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం తెరకెక్కించిన ఆ సినిమా.. మిక్స్ డ్ టాక్ అందుకుంది.

By:  Tupaki Desk   |   8 July 2024 12:00 PM GMT
శర్వా, సంపత్ నంది.. ఆ వార్తలన్నీ తూచ్!
X

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ హీరో శర్వానంద్.. తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఫీల్ గుడ్ జాన‌ర్ సినిమాల‌ను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నారు. విలక్షణమైన నటనతో ఆడియన్స్ ను అలరిస్తున్నారు. రీసెంట్ గా మనమే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫ్యామిలీ ఎంట‌ర్టైనర్ గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం తెరకెక్కించిన ఆ సినిమా.. మిక్స్ డ్ టాక్ అందుకుంది.

కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని మూవీ నిర్మాత‌ల‌కు మాత్రం లాభాల‌ను తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఒకే ఒక జీవితం సినిమా తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ గ్యాప్ ను ఇప్పుడు కవర్ చేస్తున్నారు. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న డైరెక్టర్ రామ్ అబ్బ‌రాజు ద‌ర్శక‌త్వంలో శ‌ర్వా ఓ సినిమా చేస్తున్నారు. అభిలాష్ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై స్పోర్ట్స్ బేస్ట్ మూవీకి కూడా వర్క్ చేస్తున్నారు.

ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి జరుగుతున్నాయి. ఆ చిత్రాల తర్వాత పక్కా మాస్ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ సంపత్ నందితో కలిసి శర్వానంద్ వర్క్ చేయనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. రచ్చ, బెంగాల్ టైగర్ వంటి సినిమాలతో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంపత్.. ఇప్పుడు శర్వాతో కూడా అదే జోనర్ లో మూవీ చేయనున్నారట. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

అయితే సంపత్ నంది.. మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తో గాంజా శంకర్ మూవీని చాలా రోజుల క్రితం అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇప్పుడు సాయి దుర్గ తేజ్ మరో సినిమాతో బిజీ అయిపోయారు. దీంతో గాంజా శంకర్ మూవీనే సంపత్ నంది.. శర్వానంద్ తో చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

కానీ.. సంపత్ నంది శర్వానంద్ కోసం కొత్త కథ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం రుమార్లు అని సమాచారం. ప్రస్తుతం శర్వానంద్ మూవీ స్టోరీపైనే సంపత్ నంది కంప్లీట్ ఫోకస్ చేశారని వినికిడి. అయితే ఓదెల-2 మూవీతో బిజీ గా ఉన్న సంపత్ నంది.. ఆ తర్వాత శర్వానంద్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట . మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, గాంజా శంకర్ పరిస్థితి ఏంటో తెలియాలంటే వేచి చూడాలి.