Begin typing your search above and press return to search.

వామ్మోవ్! జాన్వీ ప్రియుడి ఆస్తి విలువ‌?

టాలీవుడ్ లో దేవ‌ర సినిమాతో అడుగుపెడుతోంది జాన్వీక‌పూర్. తదుప‌రి చ‌ర‌ణ్ స‌ర‌స‌నా న‌టించేస్తోంది

By:  Tupaki Desk   |   15 April 2024 5:24 AM GMT
వామ్మోవ్! జాన్వీ ప్రియుడి ఆస్తి విలువ‌?
X

టాలీవుడ్ లో దేవ‌ర సినిమాతో అడుగుపెడుతోంది జాన్వీక‌పూర్. తదుప‌రి చ‌ర‌ణ్ స‌ర‌స‌నా న‌టించేస్తోంది. కానీ ఇప్పుడు జాన్వీ కెరీర్ కంటే వ్య‌క్తిగ‌త జీవితం ఎక్కువ‌గా ఆకర్షిస్తోంది. జాన్వీ క‌పూర్ భ‌విష్య‌త్‌లో ఒక ముఖ్య‌మంత్రి మ‌న‌వ‌డిని పెళ్లాడ‌బోతోందా? అంటూ ఒక‌టే గుస‌గుస వేడెక్కించేస్తోంది.

జాన్వీ కపూర్ ప్రియుడు శిఖర్ పహారియా మాజీ ముఖ్య‌మంత్రి సుశీల్ కుమార్ షిండే మ‌న‌వ‌డు. ఇంత‌కుముందు కాఫీ విత్ కరణ్ లో శిఖ‌ర్ స్వ‌యంగా జాన్వీతో సంబంధం గురించి వెల్లడించినప్పటి నుండి హెడ్‌లైన్స్‌లోకొచ్చాడు. ఈ జంట అనేక సందర్భాల్లో కలిసి షికార్లు చేస్తూ కనిపించారు. ప‌లుమార్లు తిరుమ‌లేశుని క‌లిసి సంద‌ర్శించారు. ఇది వారి సంబంధం గురించి ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. ఇటీవ‌ల జాన్వీ, బోనీ కూడా శిఖ‌ర్ తో త‌మ అనుబంధం గురించి ఓపెన‌వ్వ‌డంతో దీనిపై ఒక క్లారిటీ అయితే వ‌చ్చేసింది. శిఖ‌ర్ గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది చాలా త‌క్కువ‌. అతడి కుటుంబ‌ నేపథ్యం, లైఫ్ స్టైల్, నికర ఆస్తుల‌ విలువ గురించి తెలిస్తే షాక్ తింటారు.

శిఖర్ పహారియా సుప్రసిద్ధ రాజకీయ కుటుంబం నుండి వచ్చారు. అతడి తండ్రి సుశీల్ కుమార్ షిండే, గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవ‌లందించారు. అతడి తండ్రి సంజయ్ పహారియా విజయవంతమైన వ్యాపారవేత్త. శిఖర్ తన కుటుంబ రాజకీయ సంబంధాల నుండి వేరుగా తనకంటూ ఒక పేరు సంపాదించుకోగలిగాడు. అతడు ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కు వెళ్లడానికి ముందు ముంబైలోని బాంబే స్కాటిష్ స్కూల్ , సంస్కృతీ స్కూల్‌లో చదివాడు. అంతేకాదు అతడు జాన్వి పాఠశాల స్నేహితులు.

శిఖర్ పోలో క్రీడాకారుడు. నిజానికి అతను రాయల్ జైపూర్ పోలో స్క్వాడ్‌లో భాగంగా ఉన్నాడు. 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. గుర్రాలపై అతడి ప్రేమ పోలో మైదానానికి మించిన‌ది. అతడు గుర్రపు స్వారీ లో నిష్ణాతుడు. శిఖర్ 13 సంవత్సరాల వయస్సు నుండి వ్యాపార ప్రపంచంలో నిమగ్నమై ఉన్నాడు. అతడు తన స్వంత కన్సల్టింగ్ సంస్థను ప్రారంభించాడు. ఇది కొత్త పెంపుడు జంతువుల యజమానులకు సలహాలు ఇస్తుంది. అతడు వాధావన్ గ్లోబల్ క్యాపిటల్ లండన్‌లో పెట్టుబడి విశ్లేషకుడిగా కూడా పనిచేశాడు.

జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. శిఖర్ పహారియా నికర ఆస్తుల‌ విలువ దాదాపు 84 కోట్లు. అతడు తన డబ్బును అనేక దాతృత్వ వెంచర్లలో పెట్టాడు. మహిళల హక్కుల న్యాయవాది. అతడి కార్లలో లంబోర్ఘిని అవెంటడోర్ ప్ర‌త్యేకంగా ఉంది. 331కె ఇన్ స్టా అనుచరులతో సోషల్ మీడియాలో కూడా పాపులర్! జాన్వీ- శిఖర్ పాఠశాలలో స్నేహితులయ్యారు. అప్పటి నుండి సన్నిహితంగా ఉన్నారు. ఇటీవ‌ల శిఖ‌ర్ ప‌లుమార్లు జాన్వీ కపూర్‌తో కలిసి తిరుమల ఆలయానికి వెళ్లాడు. ప్ర‌తిసారీ జాన్వీని అనుస‌రిస్తూనే ఉన్నాడు.