Begin typing your search above and press return to search.

అశ్విన్ బాబు 'శివం భజే'.. ప్రశాంత్ వర్మతో ఇలా..

ఇప్పుడు అప్స‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అశ్విన్ బాబు.. శివం భజే సినిమా చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Jun 2024 8:23 AM GMT
అశ్విన్ బాబు శివం భజే.. ప్రశాంత్ వర్మతో ఇలా..
X

ఫేమస్ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా హీరో అశ్విన్ బాబు టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. జీనియస్ సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన.. ఆ తర్వాత జత కలిసే మూవీ చేశారు. రాజుగారి గది చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు ఓంకారే దర్శకత్వం వహించడం విశేషం. అనంతరం అశ్విన్ బాబు నటించిన రాజు గారి గది 2, రాజు గారి గది 3 పర్వాలేదనిపించగా.. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత గత ఏడాది హిడింబతో అలరించారు.


ఇప్పుడు అప్స‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అశ్విన్ బాబు.. శివం భజే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. అదే జోష్ తో మేకర్స్.. ఇటీవల ఫస్ట్ కట్ పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు. ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న శివం భజే మూవీ టీజర్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. శివుడి ఆజ్ఞతో తన ప్రమేయం లేకుండా దుష్టులను అశ్విన్ చంపుతాడనే కాన్సెప్ట్ తో మూవీతో సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది.

టీజర్ లో అశ్విన్ బాబు యాక్టింగ్ అదిరిపోయింది. దర్శకుడు అప్సర్ టేకింగ్ చాలా ఇంప్రెసివ్‍ గా కనిపించింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ కూడా బాగున్నాయి. మొత్తంగా టీజర్‌.. మూవీపై అంచనాలు పెంచుతోందని సినీ ప్రియులు చెబుతున్నారు. అయితే రీసెంట్ గా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. శివం భజే టీజర్ ను తన ఎక్స్ లో షేర్ చేశారు. హీరో అశ్విన్ బాబుకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. అశ్విన్ ను తమ్ముడంటూ ఆప్యాయంగా ట్వీట్ చేశారు.

అయితే ప్రశాంత్ వర్మ.. ఆక్టోపస్ మూవీని పూర్తి చేస్తున్నట్లు కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో సినిమా చేస్తారని జోరుగా ప్రచారం సాగినా.. ఇటీవల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హనుమాన్-2 షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 50 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు టాక్.

ఇక శివం భజే సినిమా విషయానికొస్తే.. అశ్విన్ బాబు సరసన దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మురళీ శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ సినిమాకు వికాస్ బాడిస మ్యూజిక్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.