Begin typing your search above and press return to search.

మొన్న పట్టించుకోలేదు.. ఇప్పుడు పొగిడేస్తుంది

మరి అది అనుకోకుండా జరిగిందో, కావాలనే జరిగిందో తెలీదు. అయితే తాజాగా దీనిపై శ్రద్ధా కపూర్ ఓ క్లారిటీ ఇచ్చేసింది.

By:  Tupaki Desk   |   25 Sep 2023 11:39 AM GMT
మొన్న పట్టించుకోలేదు.. ఇప్పుడు పొగిడేస్తుంది
X

ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సంఘటనలు అనుకోని విధంగా బాగా వైరల్ అయిపోతుంటాయి. అందరూ దాని గురించే చర్చించుకనే స్థాయికి వెళ్లిపోతుంటాయి. అలా రీసెంట్​గా శ్రద్ధా కపూర్ - రష్మిక మంధాన మధ్య జరిగిన ఓ సంఘటనే తెగ వైరల్ అయిపోయింది. రష్మిక ఎదురుపడగా.. శ్రద్ధ తల దించుకోని సైలెంట్​గా వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. మరి అది అనుకోకుండా జరిగిందో, కావాలనే జరిగిందో తెలీదు. అయితే తాజాగా దీనిపై శ్రద్ధా కపూర్ ఓ క్లారిటీ ఇచ్చేసింది.

వివరాళ్లోకి వెళితే.. ప్రముఖ బిలియనీర్, పారిశ్రమిక వేత్త ముకేశ్ అంబానీ ఇంట్లో జరిగిన గణేశ్ చతుర్థి వేడుకలు గ్రాండ్​ గా జరిగాయి. దీనికి సౌత్ టు నార్త్ చాలా మంది సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. వీరిలో హీరోయిన్లు శ్రద్ధ కపూర్ - రష్మిక కూడా ఉన్నారు. అయితే ఈ వేడుకలో శ్రద్ధ ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా.. రష్మిక లోపలికి వెళ్తూ కనిపించింది.

అదే సమయంలో మీడియా వాళ్లు రిక్వెస్ట్ చేయడంతో స్మైల్ ఇస్తూ కెమెరాలకు పోజులిచ్చింది ఫొటోలకు. ఇక అదే సమయంలో అటు నుంచి ఎదురుగా వస్తున్న శ్రద్ధాను చూసి రష్మిక పలకరించినట్టు కనిపించింది. కానీ ఏమైందో తెలీదు కానీ శ్రద్ధ రష్మికను పట్టించుకోకుండా తల దించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఇద్దరి మధ్య ఏదో వైరం ఉందన్న చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమైంది.

అయితే తాజాగా శ్రద్ధా కపూర్ డ్యామేజ్ కంట్రోల్​కు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. రష్మికను ఇన్‌స్టాలో ఫాలో అవ్వడం ప్రారంభించింది. ఇకపోతే రష్మిక.. రణ్​బీర్​ కపూర్​తో కలిసి యానిమల్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. రీసెంట్​గా దానికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజైంది.

దాన్నిపైన శ్రద్ధ రియాక్ట్ అవుతూ.. వాట్ ఎ బ్యూటీ అంటూ కామెంట్ చేసింది. ఇన్ స్టాలో ఫాలో అవ్వడం షురూ చేసింది. గతంలో ఎప్పుడూ శ్రద్ధ ఇలా స్పందించలేదు. తాజాగా వీడియో వైరల్ అయిన నేపథ్యంలో శ్రద్ధ కామెంట్​ పెట్టడంపై నెటిజన్లు మరోసారి కొత్త చర్చకు తెరలేపారు.