Begin typing your search above and press return to search.

17 ఏళ్ల త‌ర్వాత తొలి హీరోతో యాక్ష‌న్ మేకర్!

సిద్ధార్ధ్ అనంద్ నేడు బాలీవుడ్ లో యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది పేరుగా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   28 May 2024 6:52 AM GMT
17 ఏళ్ల త‌ర్వాత తొలి హీరోతో యాక్ష‌న్ మేకర్!
X

సిద్ధార్ధ్ అనంద్ నేడు బాలీవుడ్ లో యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది పేరుగా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. `బ్యాంగ్ బ్యాంగ్` నుంచి సిద్దార్ధ్ లో యాక్ష‌న్ బ‌య‌ట‌ప‌డింది. అటుపై `వార్`..`ప‌ఠాన్` లాంటి సినిమాల‌తో బాలీవుడ్ బాక్సాఫీస్ నే వ‌సూళ్ల‌తో షేక్ చేసాడు. ప్ర‌స్తుతం హృతిక్ రోష‌న్ తో మ‌రో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఫైట‌ర్ ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇలా సిద్ధార్ధ్ బాలీవుడ్ లో యాక్ష‌న్ చిత్రాల‌కు ఓ బ్రాండ్ మారిపోయాడు.

అయితే తన‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసిన హీరోతో రెండ‌వ సినిమా చేయ‌డానికి మాత్రం 17 ఏళ్లు ప‌డుతుంది. అవును ప‌డిపోయిన సైఫ్ అలీఖాన్ ని లేప‌డానికి సిద్ధార్ద్ స‌మాయ‌త్తం అవుతున్నాడు. సైలెంట్ గా ప్రాజెక్ట్ కూడా ప‌ట్టాలెక్కించిన‌ట్లు రివీల్ చేసారు. హంగేరిలోనూ బుడాపెస్ట్ లో తొలి షెడ్యూల్ మొద‌లైంది. సైఫ్ తో క‌లిసి ఉన్న రెండు ఫోటోల్ని పంచుకుంటూ నా తొలి హీరోతో సెట్లోకి వ‌చ్చానంటూ ప్ర‌క‌టించారు.

మాలో మీకు ఏదైనా మార్పు క‌నిపిస్తుందా? ఐ ల‌వ్ యూ సైఫ్ అంటూ రాసుకొచ్చారు. అయితే సినిమా టైటిల్ గానీ..ఇత‌ర ఏ వివ‌రాలు రివీల్ చేయ‌లేదు. ఇది జ్యూవెల్ థీప్ కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ అని కొంద‌రంటున్నారు. గ‌తంలో జ్యూవెల్ థీప్ కి రాబీ గ్రేవాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ బాధ్య‌త‌లు సిద్దార్ధ్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. సిద్దార్ధ్ అనంద్ నిర్మాణ సంస్థ మార్ ప్లెక్స్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ కాంబో 17 ఏళ్ల త‌ర్వాత ప‌నిచేయ‌డం విశేషం.

సిద్ధార్ధ్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసింది సైఫ్ అలీఖాన్. ఆయ‌న హీరోగా `స‌లామ్ న‌మేస్తే `అనే రొమాంటిక్ చిత్రాన్ని సిద్ధార్ధ్ తెర‌కెక్కించాడు. ఆ త‌ర్వాత మ‌రో రెండు సినిమాలు కూడా తెర‌కెక్కించాడు. కానీ అవేవి పెద్ద‌గా ఆడ‌లేదు. బ్యాంగ్ బ్యాంగ్ విజ‌యంతో బాలీవుడ్ లో ఫేమ‌స్ అయ్యాడు. అటుపై అత‌డి జ‌ర్నీ తెలిసిందే. ఈ క్ర‌మంలో సైఫ్ అలీఖాన్ డిమాండ్ కూడా త‌గ్గింది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో తొలి ఛాన్స్ ఇచ్చిన హీరోతో రెండవ సినిమా చేయ‌డం విశేషం. ప్ర‌స్తుతం సిద్దార్ధ్ అనంద్ ద‌ర్శ‌క‌త్వంలో `ఫైట‌ర్` భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. య‌శ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది.