Begin typing your search above and press return to search.

టిల్లు గాడి సౌండ్‌ రౌడీ స్టార్‌ ని దాటేసిందా...?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగానే వరుసగా విజయాలు పడ్డప్పుడే పారితోషికం పెంచాలి అనేది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఫాలో అయ్యే సూత్రం.

By:  Tupaki Desk   |   18 May 2024 4:50 AM GMT
టిల్లు గాడి సౌండ్‌ రౌడీ స్టార్‌ ని దాటేసిందా...?
X

టాలీవుడ్‌ లో సక్సెస్‌ కోసం దశాబ్ద కాలం పాటు పోరాటం చేసిన సిద్దు జొన్నలగడ్డకు 'డీజే టిల్లు' రూపంలో ప్రతిఫలం దక్కింది. ఆ సినిమా తర్వాత సిద్దు పై ఆఫర్ల వర్షం కురిసింది. అయితే సిద్దు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చాడు. ఇటీవలే టిల్లు స్వ్కేర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఈజీగా వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సిద్దు జొన్నలగడ్డ అంటూ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. యూత్‌ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ పారితోషికం విషయంలో పైపైకి వెళ్తున్నాడు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం అప్పుడే రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ పారితోషికంను సిద్దు క్రాస్ చేశాడట.

ఖుషి సినిమాకు రూ.12 కోట్లు, ఫ్యామిలీ స్టార్‌ కు రూ.15 కోట్ల పారితోషికంను విజయ్ దేవరకొండ తీసుకున్నాడు అనేది ఆ సమయంలో వచ్చిన వార్తల సారాంశం. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ టిల్లు క్యూబ్‌ తో పాటు కొత్తగా కమిట్‌ అవ్వబోతున్న సినిమాలకు రూ.15 కోట్లకు మించి కోట్‌ చేస్తున్నాడట.

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో చేస్తున్న జాక్‌ తో పాటు నీరజ కోన తో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్‌ లు పూర్తి అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ఇదే ఏడాది సిద్దు పారితోషికం రూ.20 కోట్లకు వెళ్లినా ఆశ్చర్యం లేదు అన్నట్లుగా సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

పారితోషికం భారీగా పెంచినా కూడా సిద్దు జొన్నలగడ్డ వెంట ప్రముఖ నిర్మాతలు పడుతున్నారు. ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాలు కాకుండా కొత్తగా కమిట్‌ అవ్వబోతున్న సినిమాలన్నింటికి కూడా భారీగా పారితోషికంను సిద్దు జొన్నలగడ్డ డిమాండ్‌ చేస్తున్నాడు అంటూ ఇటీవల ఒక నిర్మాత జర్నలిస్ట్‌ లతో చిట్‌ చాట్‌ లో చెప్పుకొచ్చాడు.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగానే వరుసగా విజయాలు పడ్డప్పుడే పారితోషికం పెంచాలి అనేది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఫాలో అయ్యే సూత్రం. కనుక పారితోషికం పెంపు విషయంలో సిద్దు జొన్నలగడ్డ ను విమర్శించడానికి ఏమీ ఏదు. ముందు ముందు ఆయన నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.

అందుకోసం సిద్దు మరింత కష్ట పడటం ఖాయం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా టిల్లు క్యూబ్‌ ఉంటే చాలు.. సిద్దు స్థాయి ట్రిపుల్‌ అవ్వడం ఖాయం. బొమ్మరిల్లు భాస్కర్‌ తీస్తున్న జాక్‌ విషయంలో మొదట్లో కొంత అనుమానాలు ఉన్నా.. ప్రస్తుతం ఆసక్తి పెరుగుతోంది. విడుదల వరకు మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యేలా సిద్దు ప్రమోట్‌ చేసి తీరుతాడు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.