Begin typing your search above and press return to search.

'రాజాసాబ్‌' సీక్రెట్‌ రివీల్ చేసిన ఎస్‌కేఎన్‌

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న సినిమా నుంచి టీజర్‌ లేదా ప్రత్యేకమైన వీడియో విడుదల అవ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 12:28 PM GMT
రాజాసాబ్‌ సీక్రెట్‌ రివీల్ చేసిన ఎస్‌కేఎన్‌
X

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ మూవీ 'రాజాసాబ్‌'. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించి చాలా కాలం అయింది. సలార్‌, కల్కి సినిమాల కారణంగా ప్రభాస్ రాజాసాబ్‌ సినిమాకు ఎక్కువ డేట్లు ఇవ్వలేదు. ఆ మధ్య కల్కి సినిమా విడుదల అయిన నేపథ్యంలో వరుసగా డేట్లు ఇస్తూ రాజాసాబ్‌ ని ముగింపు దశకు తీసుకు వచ్చాడు. ప్రభాస్ రాజాసాబ్‌ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు అనే విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ సినిమా కాన్సెప్ట్‌ ఏంటి, కథ ఎలాంటి ఎలిమెంట్స్ తో సాగుతుంది అనే విషయాన్ని గురించి మారుతి ఇప్పటి వరకు రివీల్‌ చేయలేదు. ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతూ వచ్చాడు.

ఎట్టకేలకు రాజాసాబ్‌ కాన్సెప్ట్‌ సీక్రెట్‌ రివీల్‌ అయింది. గత కొన్నాళ్లుగా అనధికారికంగా సినిమాలో హర్రర్‌ ఎలిమెంట్స్ ఉంటాయి అనే ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. ఇప్పుడు దర్శకుడు మారుతికి సన్నిహితుడిగా పేరున్న నిర్మాత ఎస్‌కేఎన్‌ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజాసాబ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న సినిమా నుంచి టీజర్‌ లేదా ప్రత్యేకమైన వీడియో విడుదల అవ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రభాస్ బర్త్‌డే కానుకగా ఏం రాబోతుంది అనే విషయం రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఎస్‌కేఎన్‌ తాజా మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన సినిమా గురించి మాట్లాడుతూ.. రాజాసాబ్‌ సినిమాలో హర్రర్‌ ఎలిమెంట్స్ ఉంటాయని, చాలా ప్రత్యేకంగా ఉండటంతో పాటు వినోదాత్మకంగా సాగుతుందని చెప్పుకొచ్చాడు. సినిమా గురించి ఇప్పటి వరకు ఏ చిన్న విషయం లీక్ అవ్వలేదు. సినిమాలోని హీరోయిన్స్ విషయంలోనూ ఎలాంటి లీక్ రాలేదు. హీరోయిన్స్ గా నటిస్తున్న ముద్దుగుమ్మలు సైతం ఇప్పటి వరకు లొకేషన్‌లోని ఫోటోలను షేర్‌ చేసిందే లేదు. అందుకే సినిమా గురించి ఎలాంటి విషయాలు తెలియడం లేదు. ఇప్పుడు నిర్మాత ఎస్‌కేఎన్‌ ఆ విషయాన్ని చెప్పడంతో ఎట్టకేలకు రాజాసాబ్‌ సినిమా హర్రర్‌ నేపథ్యంలో సాగే సినిమా అంటూ క్లారిటీ వచ్చింది.

ప్రభాస్ గత చిత్రాలు సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయి. అంతకు ముందు రాజాసాబ్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌ హీరో మారుతి వంటి మీడియం రేంజ్ దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేయడం ఏంటో అంటూ మొన్నటి వరకు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అదే ఫ్యాన్స్ రాజా సాబ్ ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా, దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్‌ తో రాజాసాబ్‌ సినిమాను మారుతి రూపొందించాడని తెలుస్తోంది. రాజాసాబ్‌ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.