Begin typing your search above and press return to search.

సౌత్ హ‌వా: అంబానీ పెళ్లిలో అరుదైన దృశ్యం

ముంబై జియో వ‌ర‌ల్డ్ సెంట‌ర్ లో మూడు రోజుల వివాహ మ‌హోత్స‌వాల అనంత‌రం ఈ పెళ్లి వేడుక‌ల‌కు ముగింపు ప‌లికారు.

By:  Tupaki Desk   |   17 July 2024 5:37 AM GMT
సౌత్ హ‌వా: అంబానీ పెళ్లిలో అరుదైన దృశ్యం
X

ఇటీవ‌ల ప్ర‌పంచ‌మంతా ఎక్కువ‌గా చ‌ర్చించుకున్న అంశం అంబానీ ఇంట పెళ్లి. అనంత్ అంబానీ- రాధికా మ‌ర్చంట్ జంట సుదీర్ఘ పెళ్లి వేడుక‌లు, వాటి కోసం అయిన ఖ‌ర్చు గురించి ఎక్కువ‌గా మాట్లాడుకున్నారు. దాదాపు 5000 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ పెళ్లి వేడుక‌ల్ని అంగ‌రంగ వైభ‌వంగా మునుపెన్నడూ ఏ బిలియ‌నీర్ చేయ‌లేనంత గొప్పగా ముఖేష్ అంబానీ చేసారు. ముంబై జియో వ‌ర‌ల్డ్ సెంట‌ర్ లో మూడు రోజుల వివాహ మ‌హోత్స‌వాల అనంత‌రం ఈ పెళ్లి వేడుక‌ల‌కు ముగింపు ప‌లికారు.

అయితే ఈ పెళ్లి వేడుక చాలా ఇత‌ర అంశాల‌కు నెల‌వుగా మారింది. గొప్ప అల‌యెన్స్‌ల‌కు ఆస్కారం క‌ల్పించింది. అన్ని రంగాల‌కు చెందిన దిగ్గ‌జాలు ఇక్క‌డ కొలువు దీరారు. పెళ్లి వేడుక‌ల‌తో పాటు విందును ఆస్వాధించారు. ముఖ్యంగా సినీరంగాల‌కు చెందిన ప‌లువురు దిగ్గ‌జాలు అంబానీ పెళ్లిలో సంద‌డి చేసారు. అదే స‌మ‌యంలో సౌతిండియాకు కెందిన సూప‌ర్ స్టార్లు అంతా ఒకే చోట క‌నిపించిన ఓ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా స‌ర్క్యులేట్ అవుతోంది. అంబానీ పెళ్లిలో బాలీవుడ్ క‌నెక్ష‌న్ ఉన్న సౌత్ స్టార్లు ఎక్కువ‌గా క‌నిపించారన్న ముచ్చ‌టా సాగుతోంది.

తాజాగా వైర‌ల్ అవుతున్న‌ ఫోటోగ్రాఫ్ లో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌, అక్కినేని అఖిల్, మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్ స‌హా ప‌లువురు స్టార్ హీరోలు క‌నిపించారు. ఈ పెళ్లిలో విఘ్నేష్ శివ‌న్ - నయనతార, మహేష్ బాబుకు ఇరువైపులా కూచుని సంభాషిస్తున్న ఫోటోగ్రాఫ్ హైలైట్ అయింది. సూర్య - జ్యోతిక జంట‌కు చేరువ‌గా అఖిల్ కూచుని క‌నిపించాడు. జెనీలియా డిసౌజా కూడా ఇదే చోట ఆశీనురాలై క‌నిపించింది.

అయితే ఈ ఫోటోని ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ స్వ‌యంగా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసారు. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహంలో ఈ ఫోటో తీసారు. `వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్` పేరుతో ఇది వైర‌ల్ గా మారుతోంది. ఈ ఫోటోగ్రాఫ్ లో తెలుగు-తమిళం-మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప్ర‌ముఖులంతా ఉన్నారు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ మీదుగా పాన్ చేసిన ఫోటోగ్రాఫ్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్.. అతని భార్య సుప్రియా మీనన్, క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా, అతని భార్య సంజనా గణేశన్ ఇతర అతిథుల మధ్య కూర్చొని ఉన్నారు. గతంలో, నయనతార విఘ్నేష్ శివన్ నేరుగా వ‌రుడు అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ జంట‌ను కలిసి వారి యూనియన్‌ను అభినందించిన‌ ఒక ఫోటోను షేర్ చేసారు. అలాగే ఎం.ఎస్.ధోనీతో సెల్ఫీని కూడా షేర్ చేసారు. ఎం.ఎస్.ధోనీతో మ‌హేష్ బాబు ఫోటో కూడా వైర‌ల్ అయింది. ముంబైలో జరిగిన వివాహ వేడుకలకు రజనీకాంత్ స‌హా విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న కొణిదెల కూడా అటెండ‌య్యారు. ఈ వేడుక‌ల‌కు బాలీవుడ్ నుంచి ఖాన్ లలో షారూఖ్, స‌ల్మాన్ హాజరయ్యారు. ముఖ్యంగా హిందీ చిత్ర‌సీమ‌తో అనుబంధం ఉన్న సౌత్ స్టార్లు ఈ పెళ్లి వేడుక‌లో క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రం. న‌మ్ర‌త ద్వారా మ‌హేష్ కి బాలీవుడ్ తో అనుబంధం ముడిప‌డి ఉంది. అలాగే న‌య‌న‌తార ఇటీవ‌ల జ‌వాన్ లో క‌నిపించింది. పృథ్వీరాజ్ సుకుమార‌న్ బాలీవుడ్ లో న‌టించారు. ఇక ర‌జ‌నీకాంత్ సినిమాల‌కు ఉత్త‌రాదినా గిరాకీ ఉంది. జంజీర్- ఆర్.ఆర్.ఆర్ చిత్రాల‌తో రామ్ చ‌ర‌ణ్ కు బాలీవుడ్ క‌నెక్ష‌న్ ఉంది. ఇలా అంబానీ పెళ్లిలో క‌నిపించిన వారంతా హిందీ ప‌రిశ్ర‌మ‌తో లింక‌ప్ అయి ఉన్నారు.