Begin typing your search above and press return to search.

గేర్ మార్చిన టాలీవుడ్ హీరోలు.. మంచిరోజులొచ్చాయి!

వరుస సినిమాలు చేసేస్తున్నారు. ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ సినిమాల ను చేసేస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 July 2023 7:21 AM GMT
గేర్ మార్చిన టాలీవుడ్ హీరోలు.. మంచిరోజులొచ్చాయి!
X

తెలుగు చిత్రసీమ లో గతం లో ఒకప్పుడు మన హీరోలంతా ఎన్టీఆర్​, ఏఎన్నార్​, కృష్ణ నుంచి చిరు, బాలయ్య వరకు ఒకేసారి రెండు, మూడు చిత్రాల ను సెట్స్​పైకి తీసుకెళ్లేవారు. అలానే షూటింగ్​ల లలో కూడా పాల్గొనేవారు. మిగితా హీరోల తో పోటీ పడి మరీ వరుసగా వాటిని రిలీజ్ చేసేవారు. అయితే కొంతకాలానికి ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయి. సినిమా పరిధి పెరగడంతో స్టార్ హీరోలంతా ఒకేసారి సెట్స్​పైకి తీసుకెళ్లే తమ చిత్రాల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. ఆ సంఖ్య ఏకంగా ఒకటికి పడిపోయిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితులు మారిపోతున్నాయి. మళ్లీ ఒకేసారి రెండు మూడు చిత్రాల ను ఒకేసారి సెట్స్​పైకి తీసుకెళ్లి షూటింగ్​ల లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు మన టాలీవుడ్ స్టార్ హీరోలు. తమ జోరును పెంచి.. షూటింగ్​ల తో బిజీ బిజీ గా గడుపుతున్నారు. వరుస సినిమాలు చేసేస్తున్నారు. ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ సినిమాల ను చేసేస్తున్నారు.

వారిలో మొదటి స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నారు. ఆదిపురుష్​, సలార్​, ప్రాజెక్ట్​ కె, రాజాడీలక్స్​(ప్రచారంలో ఉన్న పేరు) అంటూ అన్నీ షూటింగ్​ల లో ఒకేసారి పాల్గొంటూ ముందుకెళ్తున్నారు. వీటి లో ఆదిపురుష్ పూర్తై ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సలార్​ కు కాస్త గ్యాప్​ ఇచ్చి ప్రాజెక్ట్​ కె, రాజా డీలక్స్ షూటింగ్​ల తో బిజీ గా ఉన్నారట.

అర్జున్​ రెడ్డి ఫేమ్​ విజయ్ దేవరకొండ... రీసెంట్​ గా సమంత తో కలిసి 'ఖుషీ' సినిమా పూర్తి చేశారు. ప్రస్తుతం VD 12, 13 చేస్తున్నారు. 'జెర్సీ' ఫేమ్​ గౌతమ్​ తిన్ననూరి దర్శకత్వంలో శ్రీ లీలతో కలిసి ఓ చిత్రం చేస్తున్నారు. అదే సమయం లో సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్​తో కలిసి.. పరశురామ్ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నారు. దీనికి దిల్​రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు.

హీరో నితిన్.. వక్కంతం వంశీ తో ఓ సినిమా చేస్తూనే.. వెంకీ కుడుముల తో VNR Trio అనే వర్కింగ్ టైటిల్​ తో మరో సినిమా ను గ్రీన్ సిగ్నల్​ ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర మ్యూజిక్ వర్క్స్​ కూడా షురూ అయినట్లు చిత్రబృందం తెలిపింది.

అక్కినేని నాగచైతన్య.. ప్రస్తుతం చందూ మొండేటి ఓ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే తనకు గ్రాండ్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణతో కలిసి మరో సినిమా చేసేందుకు రెడీ గా ఉన్నారని తెలిసింది. మరోవైపు సామజవరగమణ దర్శకుడితోనూ చర్చలు జరుపుతున్నారని ప్రచారం సాగుతోంది.

ఇక మాస్ మహారాజా రవితేజ కూడా.. ఎప్పటి నుంచో ఒకేసారి రెండు మూడు చిత్రాల ను లైన్​ లో పెట్టి జోరుగానే ఉంటారు. ప్రస్తుతం ఆయన చేతి లో చాలానే ప్రాజెక్ట్​ల కు ఉన్నాయి.