Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజ‌ర్ స్క్రిప్టుపై సుబ్బ‌రాజు లీకులు

గౌరవంగా భావిస్తున్నానని ర‌చ‌యిత కం ద‌ర్శ‌కుడు సుబ్బ‌రాజు ఇటీవల ఒక ప్రాంతీయ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

By:  Tupaki Desk   |   15 Nov 2023 4:58 AM GMT
గేమ్ ఛేంజ‌ర్ స్క్రిప్టుపై సుబ్బ‌రాజు లీకులు
X

ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బరాజ్ తాజా చిత్రం 'జిగతాండ డబుల్ X' నవంబర్ 10 న థియేటర్లలో విడుదలైంది. త‌మిళ‌నాడులో బాగానే ఆడుతోంది. విజ‌యానందంలో ఉన్న ద‌ర్శ‌కుడు సుబ్బ‌రాజు మీడియాతో ముచ్చ‌ట్ల‌లో చాలా సంగ‌తులు చెబుతున్నారు. ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్‌- శంక‌ర్ కాంబినేష‌న్ మూవీ గేమ్ ఛేంజర్' చిత్రానికి రచనా బాధ్య‌త‌లు సుబ్బ‌రాజు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

దర్శకుడు శంకర్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, గౌరవంగా భావిస్తున్నానని ర‌చ‌యిత కం ద‌ర్శ‌కుడు సుబ్బ‌రాజు ఇటీవల ఒక ప్రాంతీయ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే కొన్ని నెలలుగా చర్చలు జరిపిన వెంటనే ప్రాజెక్టును ప్రారంభించామని, రాజకీయ కథాంశంతో సినిమా కథ నడుస్తుందని వివరించారు. దర్శకుడు శంకర్ తన స్టోరీ లైన్ ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో అదే విధంగా తాను కథను రాసుకున్నానని, శంక‌ర్‌కి అది నచ్చిందని వెల్లడించాడు. వారు సినిమాకి డీటెయిల్డ్ స్క్రీన్ ప్లేపై కూడా పనిచేశామ‌ని చెప్పారు.

'గేమ్ ఛేంజర్' చిత్రంతో తెలుగులో శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, SJ సూర్య, జయరామ్, సునీల్, నాజర్ తదితరులు ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ థమన్ స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. గేమ్ ఛేంజ‌ర్ నుంచి మొదటి సింగిల్ .. 'జ‌రగండి' దీపావళికి విడుదల కావాల్సి ఉంది. అయితే అనుకోని పరిస్థితుల కారణంగా ఈ పాట‌ లాంచ్ నిరవధికంగా ఆలస్యమైందని మేకర్స్ వెల్లడించారు.