Begin typing your search above and press return to search.

పుష్ప ది రూల్… సుకుమార్ ఏం ప్లాన్ చేశాడంటే..

ఇదిలా ఉంటే పుష్ప ది రూల్ క్లైమాక్స్ విషయంలో సుకుమార్ వేరే ఆలోచన చేసారంట. ముందుగా డమ్మీలతో క్లైమాక్స్ ని షూట్ చేయాలని అనుకుంటున్నారంట.

By:  Tupaki Desk   |   7 July 2024 4:55 AM GMT
పుష్ప ది రూల్… సుకుమార్ ఏం ప్లాన్ చేశాడంటే..
X

టాలీవుడ్ లో పెర్ఫెక్షన్ కి కేరాఫ్ అడ్రెస్ అంటే డైరెక్టర్ సుకుమార్ పేరు వెంటనే అందరూ చెబుతారు. తనకి కావాల్సిన అవుట్ ఫుట్ వచ్చే వరకు సుకుమార్ అస్సలు రాజీపడరు. ఎన్ని సార్లు అయిన సీన్స్ మళ్ళీ మళ్ళీ షూట్ చేస్తారు. అందుకే సుకుమార్ తన సినిమాల షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటారు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప ది రూల్ మూవీ చేస్తున్నారు. సుదీర్ఘకాలం షూటింగ్ జరుపుకున్న ఇండియన్ సినిమాల జాబితాలో పుష్ప ది రూల్ చేరిపోయింది.

నిజానికి ఆగష్టు 15న మూవీ రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో డేట్ వాయిదా వేశారు. డిసెంబర్ 6కి రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. మూవీ మెజారిటీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపొయింది. కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా తెరకెక్కించాల్సి ఉందంట. ప్రస్తుతం సుకుమార్ ఈ మూవీ షూటింగ్ పనిలోనే ఉన్నారు.

ఇదిలా ఉంటే పుష్ప ది రూల్ క్లైమాక్స్ విషయంలో సుకుమార్ వేరే ఆలోచన చేసారంట. ముందుగా డమ్మీలతో క్లైమాక్స్ ని షూట్ చేయాలని అనుకుంటున్నారంట. అది పెర్ఫెక్ట్ గా వస్తే నెక్స్ట్ లీడింగ్ యాక్టర్స్ తో షూట్ చేయాలని భావిస్తున్నాడంట. అందుకే ఇంత లేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన సీన్స్ అన్ని కూడా ఇదే ఫార్మాట్ లో కొనసాగిస్తున్నట్లుగా టాక్. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం సెట్స్ వేశారంట. ఇక్కడే మొత్తం చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. పర్ఫెక్ట్ సీన్స్ కోసం సుకుమార్ ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారంట.

ప్రస్తుతం దీని గురించే ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చేశారు. అయితే మూడేళ్లుగా ఒక్క సినిమా కూడా రాకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ తో ఉన్నారు. అందరిని పుష్ప ది రూల్ తో సంతృప్తి పరుస్తుందనే కాన్ఫిడెన్స్ తో చిత్ర యూనిట్ ఉంది. పుష్పకి నేషనల్ అవార్డు రావడంతో బన్నీ కూడా ఈ సీక్వెల్ మొదటి పార్ట్ కంటే బెస్ట్ గా ఇవ్వాలని మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టారు.

ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. అలాగే పుష్ప సినిమాలో ఉన్న సునీల్, అనసూయ కూడా ఈ సీక్వెల్ గా ఉంటారంట. వారితో పాటు జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ సక్సెస్ బట్టు పుష్ప 3 కూడా ఉంటుందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే అల్లు అర్జున్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే పుష్ప 3 కంటే ముందుగా వేరే ప్రాజెక్ట్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక మూవీ సెట్స్ పైకి వెళ్లొచ్చని టాక్ వినిపిస్తోంది.