Begin typing your search above and press return to search.

చరణ్‌ పై ఐపీఎల్‌ స్టార్‌ ఇంట్రస్టింగ్ కామెంట్స్‌

ఆర్ఆర్‌ఆర్ సినిమా తర్వాత గ్లోబల్‌ స్టార్‌ గా మారిన రామ్‌ చరణ్‌ కి అభిమానులు పెరుగుతూనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   4 Sep 2024 4:38 AM GMT
చరణ్‌ పై ఐపీఎల్‌ స్టార్‌ ఇంట్రస్టింగ్ కామెంట్స్‌
X

ఆర్ఆర్‌ఆర్ సినిమా తర్వాత గ్లోబల్‌ స్టార్‌ గా మారిన రామ్‌ చరణ్‌ కి అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో సినీ ప్రేక్షకులతో పాటు, సెలబ్రిటీలు కూడా చరణ్‌ ను అభిమానించే వారి జాబితాలో చేరి పోతున్నారు. తాజాగా టీం ఇండియా మాజీ ఆటగాడు, ఐపీఎల్‌ స్టార్ గా, చోటా థలా గా ఫ్యాన్స్ పిలుచుకునే సురేష్ రైనా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్‌ చరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ తో పాటు, తెలుగు నెటిజన్స్‌ సురేష్ రైనా కామెంట్స్ ను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

సురేష్ రైనా ఆ ఇంటర్వ్యూలో సినిమాలు, సినిమా స్టార్స్ గురించి మాట్లాడాడు. ఆ సమయంలోనే టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌ అలగ్ యాక్టర్‌ హై(వేరే లెవల్‌ నటుడు) అన్నాడు. తనకు చరణ్‌ అంటే ప్రత్యేకమైన అభిమానమని, ఆయన సినిమాలను ఇష్టపడతానని పేర్కొన్నాడు. తనకు ఇష్టమైన హీరోల్లో రామ్ చరణ్ ఒకరు అన్నాడు. ఇంకా తమిళ స్టార్‌ హీరో సూర్య అన్నా తనకు అభిమానం, ఆయన నటన, ఆయన సినిమాలను ఇష్టపడతానని తెలిపాడు. రైనా సౌత్ హీరోల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చరణ్‌, సూర్య ఫ్యాన్స్ ఈ కామెంట్స్ ను నెట్టింట పంచుకుంటున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత చరణ్‌ స్థాయి అమాంతం పెరిగింది. చరణ్‌ సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఫ్యాన్స్ అంచనాలను అందుకునే విధంగా శంకర్‌ దర్శకత్వంలో ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ సినిమాను చరణ్‌ చేస్తున్న విషయం తెల్సిందే. సౌత్‌ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. శంకర్‌ ఇండియన్‌ 2 సినిమాను ముగించాల్సి రావడంతో గేమ్‌ ఛేంజర్‌ సినిమా చాలా ఆలస్యం అయ్యింది.

ఎట్టకేలకు పూర్తి స్థాయిలో శంకర్ గేమ్‌ ఛేంజర్‌ సినిమాపై దృష్టి పెట్టడంతో షూటింగ్ స్పీడ్‌ గా జరుగుతుందని, ఈ నెలలోనే సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఒక మీడియా చిట్‌ చాట్‌ లో నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ గేమ్‌ ఛేంజర్ ను ఇదే ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని చెప్పుకొచ్చాడు. గేమ్‌ ఛేంజర్‌ లో చరణ్‌ కి జోడీగా కియారా అద్వానీ ఇంకా అంజలి నటించారు.

మరో వైపు రామ్‌ చరణ్ తదుపరి సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్‌ మూవీ ప్రారంభం అయ్యింది. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే బుచ్చిబాబు సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. చరణ్‌ - బుచ్చిబాబు సినిమా 2025 చివర్లో విడుదల చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఎంత వరకు సాధ్యం అయ్యేనో చూడాలి.