Begin typing your search above and press return to search.

హీరో సూర్య.. హైట్‌పై ఘాటుగానే..

సౌత్ ఇండియాలో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   24 Oct 2024 12:30 PM GMT
హీరో సూర్య.. హైట్‌పై ఘాటుగానే..
X

సౌత్ ఇండియాలో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో సహజసిద్ధమైన నటనతో అలరిస్తోన్న కోలీవుడ్ స్టార్ సూర్య ఒకడు. చాలా కాలం నుంచి ప్రాంతీయ భాషా చిత్రాల్లోనే నటిస్తున్నా.. నేషనల్ రేంజ్‌కు ఎదిగాడు. ఈ ఉత్సాహంతోనే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

కోలీవుడ్ స్టార్ సూర్య ఇప్పుడు తన 42వ సినిమాగా ‘కంగువ’ను చేస్తున్నాడు. మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం హై రేంజ్ యాక్షన్‌తో రాబోతుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే పిరియాడిక్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తైంది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘కంగువ’ మూవీని నవంబర్ 14వ తేదీన వరల్డ్ వైడ్‌గా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ప్రారంభించేసింది. ఇప్పటికే దీని నుంచి ప్రచార చిత్రాలను, పాటలను వదులుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషనల్ ఈవెంట్లను కూడా నిర్వహిస్తోంది.

‘కంగువ’ సినిమా ప్రచారంలో భాగంగానే తాజాగా హిందీ ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు గానూ ముంబైలో ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో సూర్యతో పాటు బాబీ డియోల్, దిశా పటానీ, దర్శకుడు శివలు పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో హీరో సూర్య మాట్లాడుతూ శారీరకంగా తనపై తానే పంచులు వేసుకున్నాడు. చూడడానికి చాలా పొట్టిగా ఉంటానని ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేశాడు.

సూర్య మాట్లాడిన మాటలపై బాబీ డియోల్ అద్భుతమైన రీతిలో స్పందించాడు. ‘సూర్య ఎత్తుగా ఉండాల్సిన అవసరం లేదు. అతను ఇప్పటికే తన చుట్టూ ఉన్న అందరి కంటే ఎంతో ఎత్తుగా, శక్తివంతంగా ఉన్నాడు. సూర్య నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అతడితో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. తద్వారా సూర్య హైట్ గురించి వస్తున్న ట్రోల్స్‌కు గట్టి కౌంటరే ఇచ్చాడు. ఇప్పుడు బాబీ డియోల్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నాయి.

ఇక, ‘కంగువ’ మూవీని స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా, యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బాబీ డియోల్, దిశా పటానీ, జగపతి బాబు, యోగి బాబు కీలక పాత్రలు చేస్తున్నారు.