Begin typing your search above and press return to search.

భారీ ప్రాజెక్ట్స్ కోసం టీ-సిరీస్ తో 'మైత్రీ' ఒప్పందం!

అయితే ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌తో భూషణ్ కుమార్ దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారని వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 Oct 2024 3:16 PM GMT
భారీ ప్రాజెక్ట్స్ కోసం టీ-సిరీస్ తో మైత్రీ ఒప్పందం!
X

పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత, టాలీవుడ్ స్టార్ హీరోలు నేషనల్ వైడ్ గా సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా హిందీ మార్కెట్ లోనూ కోట్లు కొల్లగొడుతున్నారు. దీంతో బాలీవుడ్ బడా నిర్మాతలు సైతం తెలుగు స్టార్ హీరోల మీద కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి ఒప్పందాలు కుదుర్చుకుని, సినిమాల నిర్మాణంలో భాగస్వాములుగా మారుతున్నారు.

బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ లలో టీ-సిరీస్ ఒకటి. మ్యూజిక్ లేబుల్ గా ప్రసిద్ధి చెందినప్పటికీ, గత నాలుగు దశాబ్దాలుగా సినిమాల ప్రొడక్షన్ లోనూ తమదైన ముద్ర వేసుకుంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ దర్శక హీరోలతో ఎక్కువగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు T-సిరీస్ అధినేత భూషణ్ కుమార్. ఇప్పటికే 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు చెందిన భద్రకాళి పిక్చర్స్ తో జత కట్టారు. సంయుక్త నిర్మాణంలో 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాలను నిర్మించారు.

రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ వంగా కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'స్పిరిట్' మూవీ.. T-సిరీస్ & భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ లో రూపొందనుందనే సంగతి తెలిసిందే. దీంట్లో యూవీ క్రియేషన్స్ సంస్థ కూడా భాగం పంచుకోనుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సందీప్ రెడ్డి కాంబోలో అనౌన్స్ చేయబడిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మించనున్నారు.

అయితే ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌తో భూషణ్ కుమార్ దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మైత్రీ బ్యానర్ లో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2: ది రూల్' తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టీ-సిరీస్ ఫిలింస్ పెట్టుబడులు పెట్టడమే కాదు, మ్యూజిక్ రైట్స్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టింది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి చేస్తున్న 'ఫౌజీ'.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న 'డ్రాగన్'.. తమిళ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాల్లోనూ టీ-సిరీస్ భాగస్వామ్యం ఉంటుందని తెలుస్తోంది. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ల సమర్పణలో ఈ మూడు సినిమాలు రానున్నాయి.

ఇంతకముందు యూవీ క్రియేషన్స్ తో కలిసి 'రాధేశ్యామ్' సినిమాని నిర్మించిన భూషణ్ కుమార్.. ప్రభాస్ తో 'ఆదిపురుష్' వంటి స్ట్రెయిట్ హిందీ మూవీ చేశారు. ఇదే క్రమంలో ఇప్పుడు మైత్రీ మూవీస్, భద్రకాళి పిక్చర్స్ భాగస్వామ్యంలో సినిమాలు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు.. టాలీవుడ్ నిర్మాతలతో కలిసి సినిమాలు నిర్మించడం కొత్తేమీ కాదు. కాకపోతే ఎవరూ టీ-సిరీస్ మాదిరిగా లాంగ్ టర్మ్ పార్టనర్ షిప్ మీద వరుస ప్రాజెక్ట్స్ చేయలేదు. మరి రానున్న రోజుల్లో భూషణ్ కుమార్ ఇంకా ఏయే నిర్మాణ సంస్థలతో టైఅప్ అవుతారో చూడాలి.