Begin typing your search above and press return to search.

తాప్సీ కంబ్యాక్ సీక్వెల్ తో ప్లాన్ చేసిందా?

అయితే తాజాగా తాప్సీ టాలీవుడ్ లో కంబ్యాక్ కి రెడీ అవుతున్న‌ట్లు ఓ వార్త వినిపిస్తుంది.

By:  Tupaki Desk   |   8 Aug 2024 9:30 PM GMT
తాప్సీ  కంబ్యాక్ సీక్వెల్ తో ప్లాన్ చేసిందా?
X

తాప్సీ బాలీవుడ్ కి వెళ్లిన త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్ వైపు చూసింది లేదు. మ‌ధ్య‌లో 'మిష‌న్ ఇంపాజిబుల్' అనే సినిమా చేసింది గానీ, అది ప్లాప్ అవ్వ‌డంతో పాటు, రిలీజ్ కి ముందు పెద్ద‌గా ప్ర‌చారం కూడా లేక‌పో వ‌డంతో ఆ సినిమా గురించి తెలిసింది త‌క్కువే. అలా తాప్సీ పూర్తిగా బాలీవుడ్ కే ప‌రిమిత‌మైంది. ల‌క్కీగా అమ్మ‌డు అక్క‌డ స‌క్సెస్ అయింది. టాలీవుడ్ లో ఫెయిలైనా బాలీవుడ్ మాత్రం క‌లిసొచ్చింది.

దీంతో సొంతంగా నిర్మాణ సంస్థ‌ను సైత స్థాపించి సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అమ్మ‌డి నోట టాలీవుడ్ మాటే లేదు. అయితే తాజాగా తాప్సీ టాలీవుడ్ లో కంబ్యాక్ కి రెడీ అవుతున్న‌ట్లు ఓ వార్త వినిపిస్తుంది. తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌లో మ‌హి. విరాఘ‌వ తెర‌కెక్కించిన 'ఆనందో బ్ర‌హ్మ' ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. కామెడీ హార‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించింది.

దీంతో మ‌హి. వి. రాఘ‌వ ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో మ‌ళ్లీ తాప్సీనే లీడ్ రోల్ కి ఒప్పిస్తున్నాడుట‌. వీలైనంత వ‌ర‌కూ సినిమాలో పాత పాత్ర‌ల్ని కంటున్యూ చేస్తూనే కొత్త పాత్ర‌ల్ని యాడ్ చేయాలని భావిస్తున్నారు. దీంతో తాప్సీ ఒప్పుకుంటే య‌ధావిధిగా త‌న పాత్ర త‌నికి ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రి తాప్సీ ఒప్పుకుంటుందా? లేదా? అన్న‌ది చూడాలి.

ప్ర‌స్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియాలో సంచ‌ల‌న‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ న‌టులే టాలీవుడ్ కి వ‌చ్చి న‌టిస్తున్నారు. మ‌రి తాప్సీ వ‌చ్చిన ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటుందా? వ‌దులుకుంటుందా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం అమ్మ‌డు బాలీవుడ్ లో బిజీగా ఉన్న‌సంగ‌తి తెలిసిందే.