Begin typing your search above and press return to search.

సుకుమార్ రైటింగ్స్ ఉండగా.. తబితా సమర్పణ ఎందుకు?

రావు రమేష్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది

By:  Tupaki Desk   |   23 Aug 2024 4:48 AM GMT
సుకుమార్ రైటింగ్స్ ఉండగా.. తబితా సమర్పణ ఎందుకు?
X

రావు రమేష్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకి స్పెషల్ ప్రీమియర్స్ కూడా పడ్డాయి. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో రావు రమేష్ లీడ్ రోల్ లో చేస్తున్నాడనే విషయం బయటకొచ్చిన తర్వాత కొంత పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.

ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఇదేదో కొత్తగా ఉండఉండబోతోందనే మాట వినిపించింది. అలాగే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ చీఫ్ గెస్ట్ లుగా రావడంతో ఒక్కసారిగా హైప్ మరింత పెరిగింది. అల్లు అర్జున్ ఈ సినిమాని ప్రమోట్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ దృష్టి ఈ చిత్రంపై పడింది. అల్లు అర్జున్, సుకుమార్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లు గా రావడానికి కారణం మూవీ నిర్మాణంలో భాగమైన తబితా సుకుమార్.

సుకుమార్ వైఫ్ గా ఎప్పుడు సినిమాలకి బ్యాక్ ఎండ్ లో ఉండే ఆమె మొదటిసారి మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాకి సమర్పకురాలిగా మారారు. ఆమె దగ్గరుండి సినిమాని ప్రమోట్ చేశారు. మీడియాకి కూడా దూరంగా ఉండే తబితా ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కూడా పార్టిసిపేట్ చేసి కంటెంట్ ని స్ట్రాంగ్ గా జనాలకి రీచ్ అయ్యేలా చేశారు. నిజానికి ఏదైనా సినిమా నచ్చితే సుకుమార్ డైరెక్ట్ గా ఇన్ వాల్వ్ అవుతారు.

కాని మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాకి ఆయన భార్య ఇన్ వాల్వ్ అయ్యారేంటి అనే డౌట్ చాలా మందికి వచ్చింది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బుచ్చిబాబు సానాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తబిత సుకుమార్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. సుకుమార్ రైటింగ్స్ ఉండగా మరల తబిత సుకుమార్ ప్రెజెంట్స్ ఎందుకొచ్చింది అని బుచ్చిబాబు ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. అందుకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. నేను సుకుమార్ రైటింగ్స్ లోనే ఉన్నారు. నిజానికి ఈ సినిమాని కూడా సుకుమార్ రైటింగ్స్ మీదనే సమర్పించాలని అనుకున్నాను.

అయితే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మూవీ గురించి సుకుమార్ తో మాట్లాడినపుడు పుష్ప 2 కంప్లీట్ అయ్యేవరకు నేను వేరే ఏ సినిమా చూడదలచుకోలేదు అని చెప్పారు. ఒప్పించాలని ట్రై చేసిన ఆయన కుదరదని చెప్పడంతో మూవీని వదులుకోవడం ఇష్టం లేక నేనే ప్రెజెంట్ చేస్తానని సుకుమార్ కి చెప్పేసాను. అలా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా నిర్మాణంలో సమర్పకురాలిగా భాగం అయ్యాను అని తబిత సుకుమార్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.