Begin typing your search above and press return to search.

బోనమెత్తిన మిల్కీ బ్యూటీ 800 మందితో కలిసి అలా!

బీ టౌన్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న ముద్దుగుమ్మ.. మళ్లీ తెలుగులో ఛాన్సులు అందుకుంటోంది.

By:  Tupaki Desk   |   29 July 2024 11:26 AM GMT
బోనమెత్తిన మిల్కీ బ్యూటీ 800 మందితో కలిసి అలా!
X

మిల్కీ బ్యూటీ తమన్నా కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌ లో సీనియర్లతోపాటు యంగ్ హీరోల సరసన యాక్ట్ చేసి వన్ ఆఫ్ ది క్రేజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుని దూసుకుపోతోంది. బీ టౌన్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న ముద్దుగుమ్మ.. మళ్లీ తెలుగులో ఛాన్సులు అందుకుంటోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఓదెలా 2 మూవీలో యాక్ట్ చేస్తోంది.


2021లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది కథ అందిస్తున్నారు. కెరీర్ లో తొలిసారి ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ చేస్తున్న తమన్నా.. ఓదెల-2లో శివ‌శ‌క్తి పాత్ర‌లో నటిస్తోంది. మహా శివుడి పరమ భక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్, బిహైండ్ ద సీన్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వనుంది. అందుకు తగ్గట్లే మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుతున్నారు. ఓదెల మల్లన్న టెంపుల్ సెట్‌ లో క్లైమాక్స్ సీన్స్ ను తీస్తున్నారు. సినిమాలో అత్యంత కీలకమైన క్లైమాక్స్ ను షూట్ చేయడానికి మేకర్స్ భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 800 మంది ఆర్టిస్టులతోపాటు తమన్నా సహా నటీనటులు పాల్గొంటున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హైదరాబాద్ లో ప్రస్తుతం బోనాల సందడి నెలకొన్న నేపథ్యంలో స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందరికీ బోనాల పండుగ విషెస్ తెలుపుతూ కొత్త పోస్ట‌ర్‌ ను విడుద‌ల చేశారు. అందులో తమన్నా చక్కగా చీర కట్టుకుని, కుంకుమ బొట్టు పెట్టుకుని బోనం ఎత్తుకుని కనిపించింది. ఆమె వెనుక పోతురాజు వేషాలతోపాటు చాలా మంది కనిపించారు. ప్రస్తుతం తమన్నా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. హైదరాబాద్ లో బోనాల సందడి నెలకొన్నప్పుడే బోనాల సీక్వెన్స్ ను మేకర్స్ షూట్ చేస్తున్నారు. ఇక మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వశిష్ఠ ఎన్‌ సింహా, హరిప్రియ, హెబ్బా పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ అదిరిపోయే మ్యూజిక్ ను అందిస్తున్నారు. దైవం- భూతం కాన్సెప్టుతో రూపొందుతున్నట్లు తెలుస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.