Begin typing your search above and press return to search.

సిద్దూ జొన్నలగడ్డ.. లేడి డైరెక్టర్ తో షూటింగ్ షురూ

'టిల్లు స్క్వేర్' వంటి భారీ విజయం తర్వాత స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ తన తదుపరి ప్రాజెక్ట్ 'తెలుసు కదా'తో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు.

By:  Tupaki Desk   |   6 Aug 2024 6:28 AM GMT
సిద్దూ జొన్నలగడ్డ.. లేడి డైరెక్టర్ తో షూటింగ్ షురూ
X

'టిల్లు స్క్వేర్' వంటి భారీ విజయం తర్వాత స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ తన తదుపరి ప్రాజెక్ట్ 'తెలుసు కదా'తో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే, ప్రఖ్యాత స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఆమె రూపొందించిన కథలో సిద్దూ కొత్తగా కనిపించబొతున్నట్లు తెలుస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. దర్శకురాలు యాక్షన్ అని చెబుతున్న ఒక వీడియోను విడుదల చేశారు. ఇక మొదటి షెడ్యూల్ మొత్తం 30 రోజుల పాటు జరగనుంది, ఇందులో కీలక సన్నివేశాలు, పాటల చిత్రీకరణ ఉంటాయి. మొదటి రోజే షూటింగ్‌లో సిద్దూ జొన్నలగడ్డతో పాటు హీరోయిన్ రాశి ఖన్నా పాల్గొన్నారు.

ఇందులో మరో ప్రముఖ నటి శ్రీనిధి శెట్టి కూడా నటిస్తున్నారు, అలాగే వైవా హర్షా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో సిద్దూ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ముందుగా చేసిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, చిత్రానికి ఉన్న భారీ ప్రొడక్షన్ విలువలను సూచిస్తున్నాయి. 'తెలుసు కదా' సినిమాను టీ. జి. విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టెక్నికల్ టీమ్ కూడా బలంగా ఉండటంతో, ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ ప్రాజెక్ట్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, గ్నానశేఖర్ బాబు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు పొందిన ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటింగ్ చేస్తున్నాడు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

కాస్ట్యూమ్స్ విషయంలో శీతల్ శర్మ బాధ్యతలు తీసుకున్నారు. మొత్తం మీద, 'తెలుసు కదా' చిత్రంలో నాణ్యతకు ఏమాత్రం తగ్గకుండా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకులకు అందించబోతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.