Begin typing your search above and press return to search.

వారం గ్యాప్ లో 2 భారీ సినిమాలు.. 'విశ్వ' సర్ సమ్మర్ ప్లాన్!

2025 ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. అంటే ఒక నెలలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి రెండు సినిమాలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   29 July 2024 6:53 PM GMT
వారం గ్యాప్ లో 2 భారీ సినిమాలు.. విశ్వ సర్ సమ్మర్ ప్లాన్!
X

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. కొంతకాలంగా ఈ నిర్మాణ సంస్థ పేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఓ బ్రాండ్ గా సత్తా చాటుతోంది. భారీ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. దీంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న సినిమాలపై అందరి దృష్టి నెలకొంది. మాస్ మహారాజా ధమాకాతో మంచి హిట్ అందుకున్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా చేసి షాక్ ఇచ్చారు!

రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి రవితేజ ఈగల్, గోపీచంద్ రామబాణం, శర్వానంద్ మనమే చిత్రాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ బ్యానర్ లైనప్ చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా. పదికి పైగా సినిమాలను రూపొందిస్తున్నారు టీజీ విశ్వప్రసాద్. ఈ బ్యానర్ పై రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ.. ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న మా కాళీ, స్వాగ్, విశ్వం, నరుడి బతుకు నటన, రాజా సాబ్, మిరాయ్, గూఢచారి 2, తెలుసు కదా చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీతో పాటు మరిన్ని చిత్రాలు ఆ బ్యానర్ పై త్వరలోనే నిర్మితమవ్వనున్నాయి. అయితే విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాల్లో ఒకటైన మిరాయ్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇప్పటికే వచ్చింది. కొన్ని నెలల క్రితం గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. విడుదల తేదీని కూడా ప్రకటించారు.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న మిరాయ్ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్ రాజా సాబ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ను విడుదల చేస్తూ.. మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 2025 ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. అంటే ఒక నెలలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి రెండు సినిమాలు వస్తున్నాయి.

అది కూడా ఒక్క వారం గ్యాప్ లోనే రిలీజ్ అవ్వనున్నాయి. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏప్రిల్ ఈజ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మంత్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే మిరాయ్ పై ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొనగా.. తాజా గ్లింప్స్ తో రాజా సాబ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ రెండు చిత్రాలు ఎలాంటి హిట్ అవుతాయో వేచి చూడాలి.