Begin typing your search above and press return to search.

పిల్ల‌లు మాట విన‌రు.. స్టార్ హీరోల క‌ల‌త!

బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు అమీర్ ఖాన్ త‌న పిల్ల‌లు త‌న మాట విన‌రు అని అన్నారు.

By:  Tupaki Desk   |   15 Sep 2024 8:30 PM GMT
పిల్ల‌లు మాట విన‌రు.. స్టార్ హీరోల క‌ల‌త!
X

బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు అమీర్ ఖాన్ త‌న పిల్ల‌లు త‌న మాట విన‌రు అని అన్నారు. గ్రేట్ ఇండియన్ కపిల్ షో దీనిని మ‌రోసారి వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఈ షో రెండవ సీజన్ ర‌న్నింగ్ లో ఉంది. శనివారం నాడు ఈ కామెడీ షో మేకర్స్ మొదటి అధికారిక ట్రైలర్‌ను విడుద‌ల చేసారు. ఈ సీజన్ ఎపిసోడ్‌లలో అభిమానుల‌ను అల‌రించ‌నున్న‌ అతిథులందరి స్నీక్ పీక్‌ను అందించారు. అతిథుల‌ జాబితాలో అలియా భట్, కరణ్ జోహార్, జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, రోహిత్ శర్మ వంటి సూపర్ స్టార్లు ఉన్నారు.

ట్రైలర్ లో ర‌క‌ర‌కాల‌ ఎపిసోడ్‌ల నుండి అన్ని సరదా అంశాల మాంటేజ్ ఆక‌ట్టుకుంది. అలాగే ఈ వేదిక‌పై జిగ్రా, దేవర వంటి షోలను ప్రమోట్ చేస్తున్నారు. తమ కొత్త సీజన్‌ను ప్రారంభించడానికి బాలీవుడ్ భార్యల ఫ్యాబులస్ లైవ్స్ తారాగణం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ట్రైలర్ చివరలో కపిల్ శర్మ సైఫ్ అలీ ఖాన్‌తో చాట్ చేస్తూ క‌నిపించారు.

క‌పిల్ ఈ వీడియోలో ఇలా అన్నారు. ``గతంలో అమీర్ ఖాన్ మా షోకి వచ్చాడు. నా పిల్లలు నా మాట వినరు అని చెప్పాడు. ఇప్పుడు మీ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తన నటనా రంగ ప్రవేశం చేయబోతున్నాడని నేను అనుకుంటున్నాను. అతడు మీ మాట వింటాడా?`` అని ప్ర‌శ్నించాడు. దీనికి సైఫ్ అలీఖాన్ వెంట‌నే స్పందిస్తూ.. అమీర్ ఖాన్ మాట వినాలని నేను భావిస్తున్నాను! అని ఫ‌న్నీగా బదులిచ్చారు. ఈ షోలో అమీర్ అన్న మాట త‌న పిల్ల‌లు వినాల‌నేది అతడి ఆలోచ‌న‌.

కపిల్ శర్మ షో తాజా సీజన్ సెప్టెంబర్ 21 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. కొన్ని రోజుల క్రితం టీజ‌ర్ విడుద‌లై ఆక‌ట్టుకుంది. తాజా సీజన్‌లో కపిల్ శర్మ, కికు శారదా, సునీల్ గ్రోవర్, రాజీవ్ ఠాకూర్, అర్చన పురాణ్ సింగ్ వారి వారి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. గతంలో షో మొదటి సీజన్ మార్చిలో ప్రసారం అయింది. జూన్‌లో ముగిసింది. ఈ కార్యక్రమంలో నీతూ కపూర్, రణబీర్ కపూర్, జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావు, సన్నీ డియోల్, బాబీ డియోల్, కార్తీక్ ఆర్యన్, హీరామాండి తారాగణం ఈ షోలో పాల్గొన్నారు.