Begin typing your search above and press return to search.

ది సబర్మతి రిపోర్ట్‌ టీజర్.. ఆనాటి ఘటన చుట్టూ..

2002 ఫిబ్రవరి 27వ తేదీన జ‌రిగిన గోద్రా ఘ‌టన చుట్టూ సినిమా అంతా తిరుగుతున్నట్లు ది సబర్మతి రిపోర్ట్ మేకర్స్ టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 12:56 PM GMT
ది సబర్మతి రిపోర్ట్‌ టీజర్.. ఆనాటి ఘటన చుట్టూ..
X

బాలీవుడ్ న‌టుడు, 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మస్సే ప్రస్తుతం ది సబర్మతి రిపోర్ట్‌ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న ఆ సినిమాకు రంజన్ చందేల్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాను నవంబర్ 15వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దీంతో ప్రమోషన్స్ లో భాగంగా నేడు టీజర్ ను విడుదల చేశారు. సినిమాలో నిజం కోసం పోరాడే నిర్భయ పాత్రికేయుడిగా విక్రాంత్ నటిస్తున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతుంది. రాశీ ఖన్నా తోటి రిపోర్టర్‌ గా, సీనియర్ యాంకర్‌ గా రిద్ధి యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2002 ఫిబ్రవరి 27వ తేదీన జ‌రిగిన గోద్రా ఘ‌టన చుట్టూ సినిమా అంతా తిరుగుతున్నట్లు ది సబర్మతి రిపోర్ట్ మేకర్స్ టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

టీజర్‌ లో రైలులో మంటలు చెలరేగినట్లు చూపించారు మేకర్స్. అయితే ఇది ప్రమాదమా లేదా ప్రణాళికాబద్ధమైన నేరమా అనేది ఎవరికీ తెలియదు. ఆకట్టుకునే డైలాగులు, చమత్కార సన్నివేశాలతో టీజర్ అలరిస్తోంది. చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఆ ఘటనకు ఎమోషనల్ గా అంతా కనెక్ట్ అయ్యేలా చేస్తోంది. 2002 నాటి ఘటన గురించి ఉత్సుకతను రేకెత్తిస్తోంది. దేశ చరిత్రలోని ఒక బాధాకరమైన ఘటనను సూచిస్తోంది.

టీజర్ లో తన యాక్టింగ్ తో విక్రాంత్ మెప్పించారు. ఒక హిందీ జర్నలిస్ట్ గా ఆంగ్ల కథనాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా తన గొంతును వినిపించడానికి కష్టపడుతున్న సీన్స్ లో అదరగొట్టారు. ఆయన నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. విక్రాంత్ క్యారెక్టర్‌ లో లీనమైపోయారని కొనియాడుతున్నారు. రాశీ ఖన్నా యాక్టింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. ఓవరాల్ గా టీజర్ బాగుందని రివ్యూ ఇస్తున్నారు. సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయని అంటున్నారు.

2022లో ఏం జ‌రిగిందంటే.. ఫిబ్రవరి 27న గుజరాత్ గోద్రా నుంచి అహ్మదాబాద్‌ కు సబర్మతి ఎక్స్‌ ప్రెస్ ట్రైన్ వెళ్లేందుకు రెడీ అవుతుండగా.. ఎవరో చైన్ లాగడం వల్ల ఆగింది. ఆ తర్వాత ఓ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులోని 59 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఇప్పుడు ఆ ఘటన ఆధారంగా రూపొందుతున్న ది సబర్మతి రిపోర్ట్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.