Begin typing your search above and press return to search.

సాయి తేజ్ వదిలేస్తే ఆ హీరో పిక్ చేశాడా..?

ఐతే బ్రో పూర్తైన సందర్భంలోనే మాస్ డైరెక్టర్ సంపత్ నందితో ఒక సినిమా ప్లాన్ చేశాడు సాయి దుర్గ తేజ్.

By:  Tupaki Desk   |   3 Jun 2024 1:30 AM GMT
సాయి తేజ్ వదిలేస్తే ఆ హీరో పిక్ చేశాడా..?
X

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సినిమాల విషయంలో కాస్త తడబడుతున్నాడు. విరూపాక్ష హిట్ తర్వాత మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న సాయి తేజ్ ఆ సినిమా వల్ల అతనికి ఏమాత్రం ఉపయోగం లేకుండా చేసుకున్నాడు. బ్రో కమర్షియల్ గా కూడా సోసోగానే అవ్వడం వల్ల ఆ సినిమా తేజ్ కెరీర్ పై అంత ఇంపాక్ట్ చూపించలేదు. ఐతే బ్రో పూర్తైన సందర్భంలోనే మాస్ డైరెక్టర్ సంపత్ నందితో ఒక సినిమా ప్లాన్ చేశాడు సాయి దుర్గ తేజ్. గాంజా శంకర్ అంటూ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

సితార బ్యానర్ లో తెరకెక్కించాల్సిన ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమా ఆగిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇదిలా ఉంటే సంపత్ నంది ఆ సినిమాను మాత్రం వద్దలేదని తెలుస్తుంది. సాయి తేజ్ తో సెట్ అవ్వని ఆ మూవీని మరో హీరో శర్వానంద్ తో ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. డిఫరెంట్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న శర్వానంద్ ప్రస్తుతం శ్రీరాం ఆదిత్య డైరెక్షన్ లో మనమే సినిమా చేశాడు. ఆ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా తర్వాత సంపత్ నందితోనే శర్వానంద్ సినిమా అని టాక్. అది కూడా సాయి తేజ్ తో చేయాలని అనుకున్న కథతోనే శర్వానంద్ సినిమా చేస్తాడని అంటున్నారు. టాలెంట్ ఉన్నా కూడా ఏమాత్రం లక్ కలిసి రాని వాళ్లలో సంపత్ నంది ఉంటాడు. కెరీర్ మొదట్లోనే రాం చరణ్, రవితేజలతో సినిమాలు చేసిన సంపత్ నంది ఇప్పుడు బాగా వెనకపడ్డాడు. మెగా కాంపౌండ్ లో సినిమా చేయాలని బాగా ట్రై చేసినా ఎందుకో వర్క్ అవుట్ అవ్వలేదు.

ఓ పక్క డైరెక్టర్ గా చేస్తూనే నిర్మాతగా సంపత్ నంది సినిమాలు చేస్తున్నాడు. అతని నిర్మాణ సారధ్యంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ సక్సెస్ అవ్వడంతో తమన్నాని పెట్టి ఓదెల 2 అంటూ పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాతగా చేస్తూ ప్రాజెక్ట్ బాగా రావడంలో డైరెక్టర్ కి సపోర్ట్ గా ఉన్నాడు సంపత్ నంది. శర్వానంద్ సినిమా తో డైరెక్టర్ గా కూడా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు సంపత్ నంది. మరి ఈ కాంబో సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.