Begin typing your search above and press return to search.

పుష్ప-2.. లేటెస్ట్ అప్డేట్ ఇదే!

'పుష్ప: ది రూల్' సినిమా చుట్టూ ఇలాంటి వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

By:  Tupaki Desk   |   18 July 2024 10:45 AM GMT
పుష్ప-2.. లేటెస్ట్ అప్డేట్ ఇదే!
X

గత రెండు మూడు రోజులుగా 'పుష్ప 2' సినిమా గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హీరో అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ల మధ్య విభేదాలు వచ్చాయని.. షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఒకరి తర్వాత ఒకరు విదేశాలకు వెళ్తున్నారని.. షూటింగ్ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని.. డిసెంబర్ కు వస్తుందో రాదో అనుమానం అంటూ రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి.

'పుష్ప: ది రూల్' సినిమా చుట్టూ ఇలాంటి వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వీటిపై క్లారిటీ ఇవ్వాలంటూ మేకర్స్ ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే బన్నీ - సుకుమార్ మధ్య అంతా సవ్యంగానే ఉందని, దర్శకుడు ఎడిటింగ్ పనుల మీద దృష్టి పెట్టి షూటింగ్ కు కాస్త విరామం ఇచ్చారని, ఎట్టిపరిస్థితుల్లోనూ 2024 డిసెంబర్‌ ఫస్ట్ వీక్ లో సినిమా రిలీజ్ అవుతుందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

తాజాగా అల్లు అర్జున్ టీమ్ మెంబర్ ఎక్స్ లో స్పందిస్తూ.. "డైరెక్టర్ సుకుమార్ 'పుష్ప 2' సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేసారు. ఎడిటింగ్ సమయంలో బ్రేక్ తీసుకోవడం చాలా కామన్" అని పోస్ట్ పెట్టారు. సినిమా విడుదలకు ఇంకా టైం ఉంది కాబట్టి ఫస్టాఫ్ కంప్లీట్ చేసుకొని సీజీ వర్క్ అంతా రెడీగా పెట్టుకుంటే, షూటింగ్ మొత్తం అయ్యాక మిగతా ఎడిటింగ్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.

ఇకపోతే 'పుష్ప 2' సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 25న ప్రారంభం కానుందనే ఓ వార్త కూడా వినిపిస్తోంది. అల్లు అర్జున్ మరో 10 రోజుల్లో సెట్ లో జాయిన్ అవుతారని అంటున్నారు. ఒకేసారి వివిధ భాషల్లో డబ్ చేయడం సులువు అవుతుందని దర్శకుడు సుకుమార్ ముందుగా ఎడిటింగ్‌పై దృష్టి పెట్టాలని భావించారని, అందుకే రెండు రోజుల షూటింగ్ క్యాన్సిల్ అయినట్లుగా టాక్ నడుస్తోంది.

సుకుమార్ ఇటీవల తన కూతురు చదువుకు సంబంధించిన విషయాలు చూసుకోడానికే యూఎస్ఏ ట్రిప్ కు వెళ్లారని అంటున్నారు. దర్శకుడు ఇప్పుడు హైదరాబాద్‌కి వచ్చి ప్రీ ప్రొడక్షన్‌ పై దృష్టి పెట్టారని, మరోవైపు కొత్త షెడ్యూల్ కోసం ప్లానింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విభేదాలు ఉన్నాయనే దాంట్లో ఏ మాత్రం నిజం లేదని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు కానీ, 'పుష్ప 2' సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు.

'పుష్ప: ది రైజ్' బ్లాక్ బస్టర్ గా నిలిచిన నేపథ్యంలో, 'పుష్ప: ది రూల్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, సునీల్, జగదీష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ 6న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.