Begin typing your search above and press return to search.

టైగర్​ 3 మెసేజ్​.. ఊపిరి ఉన్నంత వరకు ఓటమి ఒప్పుకోడు

పఠాన్ లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న మరో భారీ యాక్షన్ స్పై మూవీ టైగర్ 3

By:  Tupaki Desk   |   27 Sep 2023 7:10 AM GMT
టైగర్​ 3 మెసేజ్​.. ఊపిరి ఉన్నంత వరకు ఓటమి ఒప్పుకోడు
X

పఠాన్ లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న మరో భారీ యాక్షన్ స్పై మూవీ టైగర్ 3. YRF స్పై యూనివర్స్​లో భాగంగా ఈ చిత్రం రాబోతుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్​ హీరోగా భారీ బడ్జెట్​తో ఇది తెరకెక్కింది. 'ఏక్ ది టైగర్', 'టైగర్ జిందాహై' వంటి బ్లాక్ బస్టర్​ హిట్​ చిత్రాలకు సీక్వెల్​గా ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అయితే తాజాగా సినిమా నుంచి టైగర్ కా మెసేజ్ అంటూ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సల్మాన్​ దేశ ద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక సీక్రెట్ రా ఏజెంట్​గా చూపించారు. దీంతో తన నిజాయతీని నిరూపించుకోవడం కోసం, అలాగే తన దేశం కోసం టైగర్​ ఎలా పోరాటం చేసాడన్నది కథగా చూపించబోతున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.

నా అసలు పేరు అవినాశ్ సింగ్ రాథోడ్. మీ అందరికీ నేను టైగర్​ను. 20ఏళ్లుగా నా జీవితాన్ని ఇండియా సంరక్షణకే వెచ్చించాను. దానికి బదులు నేనేమి అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. ఇవాళ మీ అందరికీ చెబుతున్నారు టైగర్ మీ శత్రువు అని. టైగర్ దేశ ద్రోహి అని. 20 ఏళ్ల తర్వాత నేను ఇండియాకు నా క్యారెక్టర్ సర్టిఫికెట్ అడుగుతున్నాను. నా కొడుకు నేను కాదు, తన తండ్రి ఎవరన్నది ఇండియా చెబుతుంది. దేశ ద్రోహా లేదా దేశ భక్తుడా అని. బతికుంటే మీ సేవకై మళ్లీ వస్తాను లేదంటే జైహింద్ అంటూ సల్మాన్ టీజర్​లో సంభాషణలు చెప్పారు. ఆ తర్వాత శ్వాస ఉన్నంత వరకు ఈ టైగర్ ఓటమిని ఒప్పుకోడు అంటూ సల్మాన్ టీజర్​ను ముగించారు. యాక్షన్ సన్నివేశాలు, సల్మాన్ విన్యాసాలు, బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. వార్, పఠాన్ సినిమాలకు మించి యాక్షన్ సీన్స్ ఉండనున్నట్టు తెలుస్తుంది.

సినిమా దీపావళి పండక్కే రానున్నట్లు మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్​లో షారుక్​ రెండు రూ.1000 కోట్ల సినిమాలు సాధించడంతో టైగర్​ 3 కూడా రూ. 1000 కోట్ల టార్గెట్​తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. కాగా, షారుక్​ పఠాన్​లో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వగా.. ఇప్పుడు టైగర్ 3 సినిమాలో షారుక్​ గెస్ట్ అప్పిరెన్స్​ ఇవ్వనున్నారని సమాచారం. ట్టుకుంది.