Begin typing your search above and press return to search.

వ‌ర‌ద బాధితులకు ఆ న‌లుగురు భారీ విరాళం!

భారీ వ‌ర్షాలు తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Sep 2024 10:45 AM GMT
వ‌ర‌ద బాధితులకు ఆ న‌లుగురు భారీ విరాళం!
X

భారీ వ‌ర్షాలు తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తిన సంగ‌తి తెలిసిందే. దీంతో సినీ ప‌రిశ్ర‌మ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు న‌టులు, నిర్మాత‌లు విరాళం అందించ‌గా తాజాగా మ‌రింత మంది ముందుకొచ్చారు. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్, నిర్మాతలు ఎస్ . రాధాకృష్ణ‌, నాగ‌వంశీ 50 లక్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు.


ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి 25 ల‌క్ష‌లు, తెలంగాణ‌కు 25 ల‌క్ష‌లు చొప్పున 50 ల‌క్ష‌లు ముఖ్య‌మంత్రుల‌ స‌హాయ నిధికి అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. `భారీ వ‌ర్షాల వ‌ల్ల ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతోన్న ఆస్తి, ప్రాణ న‌ష్టాలు మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో క‌లచి వేసాయి. ఆ విప‌త్తు నుంచి తెలుగు ప్ర‌జ‌లు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ దేవుడిని ప్రార్ధిస్తూ మా వంతు స‌హాయం అందిస్తున్నాం` అన్నారు.


అలాగే యువ న‌టుడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ కూడా ఆప‌న్న హ‌స్తం అందించారు. ఒక్కో రాష్ట్రానికి 15 ల‌క్ష‌లు చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల‌కు 30 ల‌క్ష‌లు విరాళం అందించారు.` తెలుగు రాష్ట్రాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్త‌డం బాధాక‌రం. ప్ర‌జ‌లు ప‌డుతోన్న ఇబ్బంది చూస్తుంటే ఎవ‌రికీ ఇలాంటి ప‌రిస్థితి రాకూడ‌దనిపిస్తుంది.

ఈ వ‌ర‌ద‌లు చాలా కుటుంబాల‌ను క‌ష్టాల్లోకి నెట్టేసాయి. ఇలాంటి స‌మ‌యంలో ఒక‌రికొక‌రు తోడుగా ఉండటం ఎంతైనా అవ‌స‌రం. వ‌ర‌ద బాధితుల‌కు నా వంతుగా తెలుగు రాష్ట్రాల‌కు 30 ల‌క్ష‌లు అందిస్తున్నా. ఇది కొంత మందికి ఏదో రూపంలో ఉప‌యోగ ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాను` అని అన్నారు.