Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: డేట్ అయిపోయినా భామ‌ల‌ జూమింగేంటో!

ఇన్ స్టాగ్ర‌మ్, యూట్యూబ్ లో త‌మ‌కంటూ ఒక లేబుల్ క్రియేట్ చేసుకుని అందులో వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 5:26 AM GMT
ట్రెండీ టాక్: డేట్ అయిపోయినా భామ‌ల‌ జూమింగేంటో!
X

ప్ర‌జ‌లు మ‌ర్చిపోయిన చాలామంది క‌థానాయిక‌లు తిరిగి టాలీవుడ్ లో రీబూట్ అవుతున్నారు. ''డేట్ అయిపోయింది.. ఇక అంతా మ‌ర్చిపోయారు'' అనుకుంటుండ‌గానే, అప్ప‌ట్లో బాలీవుడ్ లో మాధురి ధీక్షిత్, శ్రీ‌దేవి లాంటి సీనియ‌ర్లు దూసుకొచ్చారు. వ‌రుస చిత్రాల‌తో అల‌రించారు. ర‌వీనా టాండ‌న్, కాజోల్ లాంటి సీనియ‌ర్లు కూడా కంబ్యాక్ లో ఫుల్ బిజీ అయ్యారు. టాలీవుడ్ లోను నదియా, రాశీ, ఇంద్ర‌జ లాంటి భామ‌లు తిరిగి న‌ట‌న‌లోకి అడుగుపెట్టారు. వీళ్ల‌లో న‌దియా చాలా కాలం హాట్ ఫేవ‌రెట్ గా మారింది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా చెప్పుకోద‌గ్గ సినిమాలు చేసింది. ప్రియ‌మ‌ణి, అంజ‌లి, త్రిష లాంటి క‌థానాయిక‌లు సైతం చాలా గ్యాప్ వ‌చ్చాక కంబ్యాక్ అవ్వ‌డం గ‌మ‌నించ‌ద‌గిన ప‌రిణామం.

ఇటీవ‌లి కాలంలో అంద‌రూ మ‌ర్చిపోయిన‌ హ‌నీరోజ్ న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న వీర‌సింహారెడ్డిలో న‌టించాక త‌న రేంజ్ అమాంతం పెరిగింది. ఆ త‌ర్వాత మ‌న్మ‌థుడు హీరోయిన్ అన్షు అంబానీ స‌డెన్ గా న‌ట‌న‌లోకి రీఎంట్రీ కోసం ప్ర‌య‌త్నిస్తూ మీడియా ముందుకు రావ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అంద‌రూ మ‌ర్చిపోయిన ఈ బ్యూటీ ఉన్న‌ట్టుండి స‌డెన్ గా దూసుకొచ్చిందేమిటీ? అన్న ప్ర‌శ్న త‌లెత్తింది. ఇప్పుడు మీరా జాస్మిన్ టైమ్ వ‌చ్చింది. ఈ బ్యూటీ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో ట్రెండీ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతుంటే అంద‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు. అప్ప‌ట్లో ముద్దుగా బొద్దుగా ఉండే ఈ బ్యూటీ ఇంత స్లిమ్ అయ‌పోయిందేమిటీ? అంటూ షాక్ లు తింటున్నారు. కంబ్యాక్ కోసం వీర లెవ‌ల్లో మీరా ప్ర‌య‌త్నాలు చూస్తుంటే షాక్ కి గురువుతున్నారు.

మీరా జాస్మిన్ ఇటీవలే శ్రీ విష్ణు చిత్రం 'స్వాగ్' కోసం సంతకం చేయగా.. హ‌నీరోజ్ కోసం తెలుగు ద‌ర్శ‌కులు మంత‌నాలు సాగిస్తున్నార‌ని కూడా స‌మాచారం. మ‌న్మ‌థుడు ఫేం అన్షు అంబానీ త్రినాథ‌రావు న‌క్కిన‌ దర్శకత్వంలో 'మజాకా'లో నటించనున్నారు. సందీప్ కిష‌న్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు.

అయితే ఈ ప్ర‌వాహం ఇంత‌టితో ఆగ‌దు. మళ్లీ రంభ లాంటి క‌థానాయిక‌లు తిరిగి న‌ట‌నా రంగంలో దూసుకెళ్లాల‌ని క‌ల‌లు గంటున్నారు. సీనియ‌ర్ న‌టీమ‌ణులు ర‌మ్య‌కృష్ణ వంటి వారితో స్నేహం ఉంది గ‌నుక రంభ తిరిగి కంబ్యాక్ అవ్వ‌డం క‌ష్ట‌మేమీ కాదు. ఇలా చాలామంది మ‌ర్చిపోయిన క‌థానాయిక‌లు ఇంకా సినీరంగంలో రీలాంచ్ కోసం ఎదురు చూస్తున్నార‌ని స‌మాచారం. ఆస‌క్తిక‌రంగా చాలా కాలంగా లైమ్ లైట్ కి దూరంగా ఉన్న అనుష్క శెట్టిని కూడా ఇప్పుడు మ‌ర్చిపోతున్నారు. వ‌రుస‌గా సినిమాల్లో న‌టించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ ప‌రిస్థితి. ఫ్యాన్స్ లో స్వీటీ ఎలా కంబ్యాక్ అవుతుందో చూడాల‌న్న ఆస‌క్తి నెల‌కొంది.

అయితే రీలాంచ్ కోసం భామ‌లంతా ఆధార‌ప‌డుతున్న ఏకైక వేదిక డిజిట‌ల్ మాధ్య‌మం. ఇన్ స్టాగ్ర‌మ్, యూట్యూబ్ లో త‌మ‌కంటూ ఒక లేబుల్ క్రియేట్ చేసుకుని అందులో వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నారు. వ‌రుస పోస్టుల‌తో అభిమానుల‌ను ఆక‌ర్షించ‌డం ద్వారా ఫాలోయింగ్ పెరుగుతుండ‌డంతో ప్ర‌క‌ట‌న‌ల‌ను పోస్ట్ చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. ల‌క్ష‌ల్లో ఆదాయం కూడా అందుకుంటున్నారు. నిజానికి ఇన్ స్టా వీళ్లంద‌రికీ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. దీంతో పాటె, ఒక‌వేళ సినిమా ఆఫ‌ర్లు వ‌స్తే అవి బోన‌స్ గా మారుతున్నాయి.