Begin typing your search above and press return to search.

ట్రిప్తీ దిమ్రీ నేర్చుకోక‌పోతే క‌ష్ట‌మే!

వ‌రుస‌గా క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో న‌టిస్తోంది ట్రిప్తి దిమ్రీ. ఒక్కో సినిమాకి 3-5 కోట్ల మ‌ధ్య పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీకి అవ‌కాశాల వెల్లువ త‌గ్గ‌డం లేదు.

By:  Tupaki Desk   |   29 Sep 2024 11:30 AM GMT
ట్రిప్తీ దిమ్రీ నేర్చుకోక‌పోతే క‌ష్ట‌మే!
X

వ‌రుస‌గా క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో న‌టిస్తోంది ట్రిప్తి దిమ్రీ. ఒక్కో సినిమాకి 3-5 కోట్ల మ‌ధ్య పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీకి అవ‌కాశాల వెల్లువ త‌గ్గ‌డం లేదు. యానిమ‌ల్ స‌క్సెస్ త‌ర్వాత ఈ బ్యూటీ ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను చిత్రాల‌కు అడ్వాన్సులు అందుకుంది. ప్ర‌స్తుతం ఇవ‌న్నీ చిత్రీక‌ర‌ణల్లో ఉన్నాయి.

ఇంత‌లోనే ఇప్పుడు లెజెండరీ న‌టి కం డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్‌తో క‌లిసి న‌టించే అరుదైన అవ‌కాశా న్ని ద‌క్కించుకుంది. ఈ చిత్రానికి జల్సా, తుమ్హారీ సులు ఫేమ్ విక్రమ్ మల్హోత్రా దర్శకత్వం వహించనున్నారు. పీరియాడికల్ డ్రామా క‌థాంశంతో సాగే ఈ చిత్రంలో త్రిప్తి తల్లిగా మాధురి కనిపించనుందని సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లి 2025 వేసవిలో విడుదల చేయాల‌నేది ప్లాన్.

అయితే ట్రిప్తీ ఇటీవ‌ల వ‌రుస‌గా గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌తో మెప్పిస్తోంది. యానిమ‌ల్ త‌ర్వాత గుడ్ న్యూజ్ లోను అదే త‌ర‌హాలో అందాలు ఆర‌బోసే పాత్ర‌లో క‌నిపించింది. కొత్త చిత్రం `విక్కీ విద్యా కా వో వాలా` వీడియో ప్రోమోలోను ట్రిప్తీ డ్యాన్స్ మూవ్స్ అడ‌ల్ట్ కంటెంట్ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఎల్ల‌కాలం ఇలాంటివే త‌న‌ను కెరీర్ ప‌రంగా ఆదుకోవు. న‌టిగా త‌న‌ను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ ప్రెష‌న్స్ ప‌రంగా, డ్యాన్సుల ప‌రంగా సీనియ‌ర్ న‌టీమ‌ణుల‌తో నేటిత‌రం పోటీప‌డ‌లేదు. అందుకే ట్రిప్తీ ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మాధురి ధీక్షిత్ లాంటి సీనియ‌ర్ న‌టీమ‌ణి, అద్భుత‌మైన పెర్ఫామ‌ర్ తో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం వ‌చ్చింది గ‌నుక దానిని స‌ద్విన‌యోగం చేసుకుంటుంద‌నే ఆశిద్దాం.

సీక్వెల్స్‌లో

వ‌రుస‌గా స‌హ‌న‌టీమ‌ణుల‌కు ట్రిప్తీ షాక్ లు ఇస్తోంది. కార్తీక్ ఆర్య‌న్ తో భూల్ భుల‌యా 3లో కియ‌రా అద్వాణీ న‌టించాల్సి ఉండ‌గా.. ట్రిప్తీ దిమ్రీతో రీప్లేస్ చేసిన సంగతి తెలిసిందే. భూల్ భూయయ్య 3 లో విద్యాబాలన్ కూడా నటించనున్నారు. ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. మాధురి దీక్షిత్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక ప్రదర్శనలో కనిపిస్తున్నారు. జాన్వీ క‌పూర్ న‌టించిన ధ‌డ‌క్ చిత్రానికి సీక్వెల్ లో ట్రిప్తీ అవ‌కాశం ద‌క్కించుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. నవంబర్ 22 న ధడ‌క్ 2 థియేటర్లలో విడుదల కానున్నట్లు కరణ్ జోహార్ ప్రకటించారు. ధ‌డక్ లో జాన్వి కపూర్, ఇషాన్ ఖాటర్ నటించగా, ధ‌డ‌క్ 2 లో ట్రిప్తి డిమ్రీ - సిద్ధంత్ చతుర్వేది జంటగా న‌టిస్తున్నారు. ఒరిజిన‌ల్ ధ‌డ‌క్ త‌ర‌హాలోనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి రిచ్ క్లాస్ న‌డుమ ప్రేమాయ‌ణాన్ని ఇందులో చూపిస్తున్నారు. ఈ చిత్రానికి షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, క్లౌడ్ 9 పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. జాన్వీ న‌టించాల్సిన సినిమాలో ట్రిప్తీకి అవ‌కాశం ద‌క్కింది.