Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. త్రివిక్రమ్ రియాక్షన్ ఏంటీ..

కానీ ఇది మాస్ కమర్షియల్ యాంగిల్ లో ఒక డిఫరెంట్ మూవీ అని దర్శకుడి పై ఆయన ప్రశంసలు కురిపించినట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   30 May 2024 7:33 AM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. త్రివిక్రమ్ రియాక్షన్ ఏంటీ..
X

మాస్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విశ్వక్ సేన్ ఈసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై నెలకొన్న బజ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. చాలా రోజులుగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన సక్సెస్ లు పడడం లేదు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా వెనుక త్రివిక్రమ్ కూడా ఒక భాగమని అందరికీ తెలిసిన విషయమే. ఆయన శిష్యుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ లో త్రివిక్రమ్ భార్య సౌజన్య కూడా ఈ సినిమా ప్రొడక్షన్లో ఒక నిర్మాతగా ఉన్నారు. సౌజన్య ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ పలు భిన్నమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఇప్పుడు ఈ కలయికలో బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఒక రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాను త్రివిక్రమ్ రీసెంట్ గా తన ఇంట్లో ప్రత్యేకంగా క్యూబ్ ద్వారా వీక్షించినట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా చూసిన తర్వాత ఆయన వెంటనే డైరెక్టర్ కృష్ణచైతన్యను తన ఇంటికి పిలిపించుకొని అభినందించారు.

సినిమా చూసిన తర్వాత త్రివిక్రమ్ ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎన్నో రకాల కమర్షియల్ సినిమాలు వచ్చాయి. కానీ ఇది మాస్ కమర్షియల్ యాంగిల్ లో ఒక డిఫరెంట్ మూవీ అని దర్శకుడి పై ఆయన ప్రశంసలు కురిపించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అవుట్ ఫుట్ పై త్రివిక్రమ్ కూడా పాజిటివ్ రియాక్షన్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ మరింత నమ్మకంగా కనిపిస్తోంది.

ఇక మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా హడావిడి మొదలు పెట్టబోతోంది. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే మూవీగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రెండ్ సెట్ చేస్తుందని సమాచారం. ఇక ఈ సినిమాలో నేహా శెట్టి అంజలి కీలకపాత్రలో నటించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.