Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కోస‌మేనా? త్రివిక్ర‌మ్ స‌తీస‌మేతంగా కొండ‌పైకి!

తాజాగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కూడా కాలిన‌డ‌కన మొక్కు చెల్లించిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న తో భార్య సౌజ‌న్య కూడా మెట్ల మార్గం ద్వారా కొండ‌పైకి చేరుకున్నారు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 5:32 AM GMT
ప‌వ‌న్ కోస‌మేనా? త్రివిక్ర‌మ్ స‌తీస‌మేతంగా కొండ‌పైకి!
X

పిఠాపురం నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ మెజార్టీతో గెల‌వ‌డం, అటుపై ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం, ప‌లు శాఖ‌లకు ఆయ‌న మంత్రిగా వ్య‌వ‌హ‌రించ‌డంతో మెగా ఫ్యామిలీ సహా అభిమానుల ఆనందానికి అవుదుల్లేవ్. దీంతో ఇప్ప‌టికే మెగా మేన‌ల్లుడు సాయిదుర్గ‌తేజ్ తిరుమ‌ల శ్రీవారిని కాలిన‌డ‌క‌న వెళ్లి ద‌ర్శించుకున్న సంగ‌తి తెలిసిందే. మావ‌య్య గెలిస్తే కాలిన‌క‌డ‌క‌న వ‌చ్చి మొక్కు చెల్లిస్తాన‌ని స్వామి వారికి మాటిచ్చాడు.

ఆ మాట‌ను నిల‌బెట్టుకున్నాడు. తన టీమ్ తో పాటు ఇటీవ‌లే శ్రీవారిని మెట్ల మార్గం ద్వారా చేరుకుని ద‌ర్శ‌నం చేసుకున్నాడు. తాజాగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కూడా కాలిన‌డ‌కన మొక్కు చెల్లించిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న తో భార్య సౌజ‌న్య కూడా మెట్ల మార్గం ద్వారా కొండ‌పైకి చేరుకున్నారు. అనంత‌రం శ్రీవారిని ద‌ర్శించుకుని మొక్కు చెల్లించారు. అయితే ఈ మొక్కు తీర్చుకోవ‌డం అన్న‌ది స్నేహితుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలిచినందుకా? లేక ఆయ‌న వ్య‌క్తిగ‌తానికి సంబంధించిందా అన్న‌ది తెలియాలి.

ప‌వ‌న్ -త్రివిక్ర‌మ్ స్నేహం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు మంచి స్నేహితులు. వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్ లో ఎన్నో స‌క్సెస్ పుల్ చిత్రాలు వ‌చ్చాయి. అటుపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత బ్యాకెండ్ లో వ‌ర్క్ చేసింది గురూజీ అని కూడా ప్ర‌చారంలో ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పీచ్ లు రాసిచ్చేది ఆయ‌నే అంటూ కూడా ప్ర‌చారం సాగింది.

ప‌వ‌న్ లో పోరాట ప‌టిమ‌ల గురించి ఎన్నో వేదిక‌ల‌పై త‌న‌దైన శైలిలో చెప్పుకొచ్చే ప్ర‌య‌త్నం చేసారు. రాజ‌కీయాలంటూ ప్ర‌త్య‌క్షంగా ఉద్దేశించి మాట్లాడ‌లేదు గానీ...ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. స‌రిగ్గా ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెల‌వ‌డం...అదే స‌మ‌యంలో గురూజీ మెట్ల‌ మార్గం ద్వారా శ్రీవారి చెంతకు చేర‌డం ఆస‌క్తిక‌రం.