Begin typing your search above and press return to search.

ధనుష్, ఐశ్వర్య డైవర్స్ లో ట్విస్ట్..!

ఐతే వీరిద్దరి డైవర్స్ కేసు ఈ ఇయర్ ఏప్రిల్ లోనే నోటీసులు జారీ చేయగా అక్టోబర్ 7న విచారణ ఉన్నా కూడా కోర్టులో అటు ధనుష్ ఇటు ఐశ్వర్య ఇద్దరు కోర్టుకి హాజరు కాలేదు.

By:  Tupaki Desk   |   8 Oct 2024 8:26 AM GMT
ధనుష్, ఐశ్వర్య డైవర్స్ లో ట్విస్ట్..!
X

కోలీవుడ్ స్టార్ ధనుష్ సూపర్ స్టార్ రజిని కూతురు ఐశ్వర్య రజినీకాంత్ లు 2004 లో పెళ్లాడి 18 ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉన్నారు. వారిద్దరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఐతే కొన్ని విభేదాల వల్ల 2022 లో ధనుష్, ఐశ్వర్య తాము సెపరేట్ అవుతున్నామని ప్రకటించారు. అప్పటి నుంచి ధనుష్, ఐశ్వర్య ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు.

ఐతే కోలీవుడ్ లో వీరి డైవర్స్ పై రకరకాల వార్తలు వినిపించాయి. ధనుష్ తో ఐశ్వర్య డైవర్స్ వెనక రీజన్ ఒక హీరోయిన్ అని కూడా మీడియా హడావిడి చేసింది. ఐతే వీరిద్దరి డైవర్స్ కేసు ఈ ఇయర్ ఏప్రిల్ లోనే నోటీసులు జారీ చేయగా అక్టోబర్ 7న విచారణ ఉన్నా కూడా కోర్టులో అటు ధనుష్ ఇటు ఐశ్వర్య ఇద్దరు కోర్టుకి హాజరు కాలేదు. అందుకే కోర్ట్ ఈ కేసుని అక్టోబర్ 19కి అడ్జి శుభాదేవి వాయిదా వేశారు.

ఐతే ధనుష్, ఐశ్వర్య కోర్టుకి హాజరు కాకపోవడం వెనక రీజన్స్ ఏమై ఉండొచ్చా అని ఫ్యాన్స్ గుసగుసలాడుతున్నారు. మళ్లీ ఇద్దరు కలిసి ఉండే అవకాశం ఏమైనా ఉందా అనే టాక్ వినిపిస్తుంది. ఐతే డైవర్స్ కేసు కోర్ట్ లో ఉండగా దానితో ఎలాంటి సంబంధం లేకుండా ధనుష్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. మరోపక్క ఐశ్వర్య కూడా సినిమా ప్రొడక్షన్ లో బిజీగా మారింది.

ధనుష్, ఐశ్వర్య డైవర్స్ మ్యాటర్ కంప్లీట్ గా వారి పర్సనల్ మ్యాటరే ఐనా ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హడావిడి చేయడం విశేషం. కోర్టుకి ఇద్దరు డుమ్మా కొట్టడం వెనక కారణాలు ఏమై ఉంటాయా అని ఆడియన్స్ గెస్ చేస్తున్నారు. ఒకవేళ వారిద్దరు తమ విడాకుల కేసు వెనక్కి తీసుకుని మళ్లీ కలిసి ఉంటే మాత్రం ఇద్దరి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉంటారు. ధనుష్ ప్రస్తుతం కుబేర సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఆయన డైరెక్షన్ లో వచ్చిన రాయన్ హిట్ అవ్వడంతో మంచి జోష్ లో ఉన్నారు.

రాయన్ ఇచ్చిన పుష్ తో ధనుష్ ఇడ్లీ బండి అనే మరో సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ చేసింది.