Begin typing your search above and press return to search.

నిండుగా పెళ్లి పందిరిలో వరలక్ష్మీ జోడి.. వైరల్ పిక్స్

తన ప్రియుడు, ముంబైకు చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌ దేవ్ తో ఏడడుగులు నడిచింది.

By:  Tupaki Desk   |   11 July 2024 4:03 PM GMT
నిండుగా పెళ్లి పందిరిలో వరలక్ష్మీ జోడి.. వైరల్ పిక్స్
X

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఆమె యాక్టింగ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. విలన్ రోల్స్ లో, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆమె ఎక్కువగా కనిపిస్తూ.. తన నటనతో ప్రాణం పోస్తుంటోంది. అయితే ఇటీవల ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, ముంబైకు చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌ దేవ్ తో ఏడడుగులు నడిచింది.


థాయ్ ల్యాండ్ లోని ఓ బ్యూటిఫుల్ బీచ్ రిసార్ట్ లో జూలై 2వ తేదీన వరలక్ష్మి, నికోలాయ్.. మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే పెళ్లి ఫోటోలు.. వరలక్ష్మి సహా ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. దీంతో ఆమె వివాహ వేడుకకు చెందిన అదిరిపోయే పిక్స్.. ఇప్పుడు బయటకు వచ్చాయి.


ప్రస్తుతం సోషల్ మీడియాలో వరలక్ష్మి, నికోలాయ్ పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి. పెళ్లి మండపం అంతా అందమైన పువ్వులతో డెకరేషన్ చేశారు. దీంతో మండపం నేచురల్ గా చాలా బాగుంది. వరలక్ష్మి రెడ్ కలర్ పట్టు చీరలో మెరిసిపోయింది. అదిరిపోయే ఆభరణాలతో కుందనపు బొమ్మలా ఉంది. వివాహ వేడుక అంతా దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. వేడుకల్లో రాధిక సహా అంతా ఫుల్ హుషారుగా కనిపిస్తున్నారు.


ఇక పెళ్లి పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండడంతో మరోసారి నెటిజన్లు.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే థాయ్ ల్యాండ్ లో వివాహం అయ్యాక.. చెన్నై లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్, హీరో బాలకృష్ణ సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.


అయితే వరలక్ష్మి వివాహ వేడుకకు సంబంధించి రీసెంట్ గా పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. వరలక్ష్మి పెళ్లి కోసం రూ. 200 కోట్లకు పైగానే శరత్ కుమార్ ఖర్చు చేశారని టాక్ వినిపించింది. దీంతో ఆయన ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. చాలా సింపుల్ గానే తన బిడ్డ పెళ్లి చేశానని చెప్పారు. అంత డబ్బు ఎక్కడుందో తనకు తెలియదని అన్నారు. మొత్తానికి వరలక్ష్మి శరత్ కుమార్.. ఓ ఇంటి కోడలు అయిపోయింది.