Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్.. క్రేజీ లైనప్!

అలాగే పాన్ ఇండియా అప్పీల్ ఉన్న మాస్ యాక్షన్ కథలు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 July 2024 11:30 AM GMT
వరుణ్ తేజ్.. క్రేజీ లైనప్!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి చివరగా వచ్చిన గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు రెండు డిజాస్టర్ అయ్యాయి. అంతకు ముందు చేసిన ‘గని’ కూడా వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో కథల ఎంపికలో వరుణ్ తేజ్ కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రజెంట్ ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే కొత్త కథలని పిక్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే పాన్ ఇండియా అప్పీల్ ఉన్న మాస్ యాక్షన్ కథలు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

అందులో భాగంగానే ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా సినిమాని వరుణ్ తేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేస్తున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో మాఫియా కథాంశంతో పీరియాడికల్ జోనర్ మూవీగా మట్కా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాదిలో మట్కా మూవీ ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా సిద్ధమవుతోంది. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది.

దీని తర్వాత వరుణ్ తేజ్ చేయబోయే సినిమాల గురించి ఆసక్తికర ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. ఈ మూవీ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందంట. ఈ ఏడాదిలోని స్టార్ట్ చేసే ప్లానింగ్ లో నిర్మాతలు ఉన్నారు.

దీని తర్వాత టచ్ చేసి చూడు ఫేమ్ విక్రమ్ సిరికొండ చెప్పిన ఓ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ కి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బేస్డ్ గా నడిచే ప్రేమ కథతో మూవీ ఉంటుందంట. అంటే ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని కోణంలోనే ఈ స్టోరీని విక్రమ్ సిరికొండ చూపించబోతున్నట్లు అర్ధమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించనున్నట్లు సమాచారం. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మూడు లేదా నాలుగో వారంలో ప్రారంభించాలని అనుకుంటున్నారంట.

2025 జనవరి ఎండ్ లో మూవీని రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి సంబంధించిన క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ప్రస్తుతం ఉన్నారంట. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ మూడు సినిమాలపైన వరుణ్ తేజ్ చాలా నమ్మకంతో ఉన్నారు. కచ్చితంగా ఈ సినిమాలతో తన మార్కెట్ ని మళ్ళీ బూస్ట్ చేసుకునే పనిలో వరుణ్ తేజ్ పడ్డారు.