Begin typing your search above and press return to search.

మిస్ వరల్డ్ ఆశలన్నీ మెగా హీరో పైనే!

By:  Tupaki Desk   |   24 Feb 2024 4:34 PM GMT
మిస్ వరల్డ్ ఆశలన్నీ మెగా హీరో పైనే!
X

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఫీల్డ్. హీరోయిన్లకు అభినయంతో పాటుగా అందం కూడా ఎంతో అవసరం. న‌ట‌న కాస్త త‌క్కువైనా పర్లేదుగానీ, గ్లామర్ విష‌యంలో మాత్రం మన ఫిలిం మేకర్స్ కాంప్ర‌మైజ్ అవ్వరు. అందుకే అందాల పోటీల్లో గెలిచిన వారికి ఎల్లప్పుడూ సాద‌ర స్వాగ‌తం ప‌లికేందుకు రెడీగా ఉంటారు. మిస్ యూనివ‌ర్స్, మిస్ ఇండియా, మిస్ వ‌ర‌ల్డ్ టైటిల్స్ గెలిచిన ఎందరో ముద్దుగుమ్మలను హీరోయిన్లుగా పరిచయం చేసారు. జీన‌త్ అమ‌న్, జూహీ చావ్లా, సుష్మితా సేన్, ఐశ్వ‌ర్య రాయ్, న‌మ్ర‌తా శిరోద్కర్, లారా దత్తా, ప్రియాంక చోప్రా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సుందరీమణులు ఉన్నారు. వారిలో మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ కూడా ఉంది.

హర్యానాకు చెందిన అందాల భామ మానుషి చిల్లర్.. 2017లో 67వ మిస్‌ వరల్డ్ టైటిల్ విన్నర్ గా నిలిచింది. 17 ఏళ్ల తర్వాత భారత్‌కు ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించిన యువతిగా, ఈ కీరీటం గెలిచిన ఆరవ ఇండియన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ అమ్మడితో సినిమాలు చేయడానికి, హీరోయిన్ గా పరిచయం చెయ్యడానికి బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆసక్తి కనబరిచారు. చివరకు 2022లో యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇందులో రాణి సంయోగిత పాత్ర‌లో నటించింది. అక్షయ్ కుమార్ హీరోగా చంద్రప్రకాష్ ద్వివేది తెరకెక్కించిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది.

ఆ తర్వాత అదే యశ్ రాజ్ ఆదిత్య చోప్రా నిర్మాణంలో 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' అనే మరో హిందీ సినిమా చేసింది మానుషీ చిల్లర్. విక్కీ కౌశల్ హీరోగా విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ డ్రామా 2023లో ఘోర పరాజయం చవిచూసింది. దీంతో హీరోయిన్ గా రాణించాలనుకున్న మాజీ ప్రపంచ సుందరికి నిరాశే ఎదురైంది. పెద్ద బ్యానర్స్ లో స్టార్ హీరోలతో నటించినా ఫలితం లేకుండా పోయింది. అయితే బాలీవుడ్ లో రెండు బ్యాక్ టూ బ్యాక్ భారీ ఫ్లాప్స్ తరువాత మానుషి ఇప్పుడు టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెడీ అయింది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాలో మానుషి చిల్లార్‌ హీరోయిన్ గా నటించింది. శక్తి ప్రతాప్ సింగ్ హడా అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ ఈ ఏరియల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్, మార్చి 1న తెలుగు హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభించింది. ఇందులో రాడార్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టింది మానుషీ. వరుణ్ తో కలిసి ఈ సినిమా కోసం దూకుడుగా ప్రచారం చేస్తోంది. ఇది కచ్చితంగా తనకు ఫస్ట్ సక్సెస్ రుచి చూపిస్తుందని ధీమాగా ఉంది. ఈ బ్యూటీకి ఈసారి హిట్టు దక్కబోతోందనే ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.

ఒకవేళ నిజంగానే 'ఆపరేషన్ వాలెంటైన్' హిట్టయితే మాత్రం మానుషీ కెరీర్ పుంజుకునే అవకాశం ఉంది. ద్విభాషా చిత్రం కాబట్టి టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోనూ క్రేజీ హీరోయిన్ గా మారొచ్చు. ఇది తర్వాత రాబోయే 'బడే మియాన్ చోటే మియాన్' మూవీకి ప్లస్ అవుతుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథవీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా వంటి పాపులర్ స్టార్స్ తో కలిసి నటిస్తోంది. ఈద్ స్పెషల్ గా 2024 ఏప్రిల్ 11న పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇదే క్రమంలో జాన్ అబ్రహాంతో కలిసి 'టెహ్రాన్' అనే యాక్షన్ థ్రిల్లర్ లో మానుషి చిల్లర్ నటిస్తోంది. మరి ఈ చిత్రాలన్నీ మిస్ వరల్డ్ కెరీర్ కి ఎలా ఉపయోగపడతాయో వేచి చూడాలి.