Begin typing your search above and press return to search.

ఫుల్ స్పీడు మీదున్న మెగా హీరో!

ఇలా వరుణ్ తేజ్ లైనప్ లో వేటికవే ప్రత్యేకమైన మూడు క్రేజీ చిత్రాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   25 July 2024 5:06 AM GMT
ఫుల్ స్పీడు మీదున్న మెగా హీరో!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ఆశించిన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఆయన సోలోగా హిట్టు కొట్టి దాదాపు ఐదేళ్లు కావొస్తోంది. 'గని', 'గాండీవధారి అర్జున', 'ఆపరేషన్ వాలెంటైన్' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా మారాయి. అయితే ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి వరుణ్ తేజ్ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు.

వరుణ్ తేజ్ ప్రస్తుతం 'మట్కా' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా పతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1958 - 1982 మధ్య కాలంలో వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో, యావత్ దేశాన్ని కదిలించిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.

వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్స్ లో 'మట్కా' సినిమాని నిర్మిస్తున్నారు. ఇది వరుణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. ఇందులో మెగా హీరో ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నారు. కుర్రాడి దగ్గర నుంచి ముసలోడి వరకూ నాలుగు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ లో వరుణ్ మేకోవర్ ఆకట్టుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వరుణ్ తేజ్ ఓ సినిమా కమిట్ అయ్యారు. 'టచ్ చేసి చూడు' ఫేమ్ విక్రమ్ సిరికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లవ్ స్టోరీ అని, తెలుగులో ఇంతకముందు రాని కొత్త పాయింట్ తో తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే 'ఎక్స్‌ప్రెస్ రాజా' ఫేమ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ఓ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాయని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఇతర ప్రధాన నటీనటుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని తెలుస్తోంది. సెప్టెంబరు చివర్లో ఈ సినిమాని ప్రారంభించి, వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. 50 శాతానికి పైగా షూటింగ్ విదేశాల్లో జరగనుందని టాక్.

ఇలా వరుణ్ తేజ్ లైనప్ లో వేటికవే ప్రత్యేకమైన మూడు క్రేజీ చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ వచ్చే ఏడాదిలో షెడ్యూల్ చేయబడతాయి. నిజానికి మెగా హీరో కెరీర్ ప్రారంభం నుంచీ కథా పరంగా వైవిధ్యాలు, ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. వాటిల్లో కొన్ని వర్కౌట్ అయితే, మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. చివరగా 2019లో 'గద్దలకొండ గణేష్' సినిమాతో సోలోగా కమర్షియల్ సక్సెస్ సాధించారు. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ తో కలిసి ఎఫ్ 3' వంటి మల్టీస్టారర్ తో విజయాన్ని అందుకున్నారు. మరి రానున్న రోజుల్లో వరుణ్ కెరీర్ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.