Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్.. ఈ కొరియా కథేంటీ..

అయితే ఈ సారి బలమైన ఎమోషన్స్, అంతే బలమైన కథ, కథనాలు ఉండే సినిమాలని వరుణ్ తేజ్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   23 July 2024 11:38 AM GMT
వరుణ్ తేజ్.. ఈ కొరియా కథేంటీ..
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా కాస్త రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు వరుణ్ తేజ్ డిఫరెంట్ ఫార్మాట్ కథలని చేసిన కూడా ఎక్కడో కాన్సెప్ట్ ల ఎంపిక విషయంలో పొరపాటు చేశాడు. అందుకే వరుణ్ తేజ్ ఎక్కువగా డిజాస్టర్ లు సొంతం చేసుకున్నారు. గని, గాండీవదారి అర్జున్, ఆపరేషన్ వాలంటైన్ సినిమాలు మూడు హ్యాట్రిక్ డిజాస్టర్ లుగా మారాయి. తన క్యారెక్టరైజేషన్స్ విషయంలో కొత్తదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న కూడా ఎమోషన్స్ వర్క్ అవుట్ కాకపోవడంతో ప్రేక్షకులు వీటిని తిరస్కరించారు.

అయితే ఈ సారి బలమైన ఎమోషన్స్, అంతే బలమైన కథ, కథనాలు ఉండే సినిమాలని వరుణ్ తేజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం సౌత్ లో మాఫియా కథల ట్రెండ్ నడుస్తోంది. పీరియాడిక్ జోనర్ లో మాఫియా కథలని డార్క్ ఫిక్షనల్ గా దర్శకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కరుణకుమార్ దర్శకత్వంలో మట్కా అనే చిత్రాన్ని వరుణ్ తేజ్ చేస్తున్నారు. 1970 బ్యాక్ డ్రాప్ లో మాఫియా కథాంశంతో ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

నెక్స్ట్ వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. మూవీ కథ మొత్తం కొరియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. ఇప్పటికే క్యాస్టింగ్ సెలక్షన్ లో మేర్లపాక గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. సింగిల్ షెడ్యూల్ లో కొరియా బ్యాక్ డ్రాప్ మొత్తం షూట్ కంప్లీట్ చేసుకొని వస్తారంట.

ఆ వెంటనే విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో చేయబోయే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్రేమకథా చిత్రాన్ని చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమా మెజారిటీ షూటింగ్ యూఎస్ లో జరుగుతుందంట. అందుకే మేర్లపాక మూవీ కొరియా షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే వరుణ్ తేజ్ యూఎస్ ఫ్లైట్ ఎక్కేయబోతున్నాడంట. అక్కడ విక్రమ్ సిరికొండ సినిమా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఇండియా తిరిగి రానున్నారంట.

నెక్స్ట్ హైదరాబాద్ లో ఈ రెండు సినిమాల షూటింగ్ ని ఒకే సారి చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూడు సినిమాలని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారంట. ఈ ఏడాది వరుణ్ తేజ్ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయడం లేదు. ఈ గ్యాప్ ని 2025లో ఫుల్ ఫీల్ చేయబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది.