Begin typing your search above and press return to search.

వైరల్‌ పిక్ : ఈ అరుదైన కలయిక కారణం ఏంటో?

సోషల్‌ మీడియాలో ప్రతి రోజు వందల కొద్ది ఫోటోలు షేర్‌ అవుతూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   11 July 2024 6:08 AM GMT
వైరల్‌ పిక్ : ఈ అరుదైన కలయిక కారణం ఏంటో?
X

సోషల్‌ మీడియాలో ప్రతి రోజు వందల కొద్ది ఫోటోలు షేర్‌ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని ఫోటోలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. స్టార్స్ షేర్ చేసే ఫోటోల్లో కూడా కొన్ని కొన్ని వైరల్‌ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు కోలీవుడ్‌ స్టార్‌ అజిత్, దర్శకుడు వెంకట్‌ ప్రభు కలయిక ఫోటో వైరల్‌ అవుతోంది.

వీరిద్దరి కాంబోలో దాదాపు 15 ఏళ్ల క్రితం మంకథ అనే సినిమా వచ్చింది. తెలుగు లో జూదగాడు గా విడుదల అయిన మంకథ మంచి హిట్‌ గా నిలిచింది. చాలా కాలంగా మంకథ సినిమాకు సీక్వెల్‌ గా వీరిద్దరి కాంబోలో మూవీ వస్తే బాగుండు అన్నట్లుగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నారు.

ఇద్దరు కూడా వారి వారి ప్రాజెక్ట్‌ లతో బిజీగా ఉన్నారు. అజిత్ ప్రస్తుతం అజార్ బైజాన్‌ లో షూటింగ్ చేస్తూ ఉన్నాడు. అక్కడ వెంకట్‌ ప్రభు ప్రత్యక్ష్యం అవ్వడం, అజిత్‌ తో కలిసి ఉన్న ఫోటో ను సోషల్‌ మీడియాలో వదలడం తో తమిళ మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇంతకు వీరిద్దరి కలయిక కి కారణం ఏంటి అనేది మాత్రం స్పష్టత లేదు. అయితే చాలా మంది మాత్రం వీరిద్దరి కాంబోలో కొత్త సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన చర్చ కోసం కలిసి ఉంటారేమో అని తమ అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు.

మరి కొందరు వెంకట్‌ ప్రభు ప్రస్తుతం విజయ్ తో చేస్తున్న గోట్‌ సినిమాలో అజిత్‌ తో కీలకమైన గెస్ట్‌ రోల్‌ ను చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, అందుకు అజిత్‌ కూడా ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు ప్రచారాల్లో ఏ ఒక్కటి నిజం అయినా కూడా కచ్చితంగా అజిత్‌ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఇంతకు వీరి కలయిక కారణం వారే చెప్పాలి..!