SSMB29: మరో గుట్టు విప్పిన రైటర్ విజయేంద్రప్రసాద్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీలో విజయేంద్రప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
By: Tupaki Desk | 3 Feb 2025 9:41 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘SSMB29’ మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సినిమాని కూడా డిఫరెంట్ వరల్డ్ లో హైలెట్ అయ్యేలా కథను సిద్ధం చేశారు. ఈ విషయాన్ని చాలా సందర్భాలలో ఆయన చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీలో విజయేంద్రప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
‘SSMB29’ మూవీ కంప్లీట్ అడ్వాంచర్ జోనర్ లో ఉంటుందని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇండియాలో ఇలాంటి కథతో మూవీ రాలేదని అన్నారు. అలాగే మహేష్ బాబు కెరియర్ లో కూడా ఫస్ట్ టైం ఈ జోనర్ లో సినిమా చేస్తున్నారని విజయేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఈ కథ సిద్ధం చేసుకున్నప్పుడు మహేష్ బాబు ఈ జోనర్ లో ఇది వరకు సినిమాలు చేశాడా అనేది ఒకటికి రెండు సార్లు చూసుకున్నామని అన్నారు.
అలాగే మూవీ స్టోరీ కాంటెంపరరీలోనే ఉంటుందని, కథపైన చాలా కసరత్తు చేసి రాశామని అన్నారు. ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి జోనర్ లో సినిమా వచ్చిందా లేదా అనేది చూసుకొని రెడీ చేయడం జరిగిందని అన్నారు. కచ్చితంగా ఇదొక సరికొత్త అడ్వెంచర్ ఎక్స్ పీరియన్స్ ని ఆడియన్స్ ని అందిస్తుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కథని డెవలప్ చేసిన కూడా కథని మహేష్ బాబు క్రేజ్ డామినేట్ చేయదని అన్నారు.
అలా చేస్తే సినిమా ఆడియన్స్ కి రీచ్ అవ్వడాన్ని తెలిపారు. కథాబలంతోనే మూవీస్ సక్సెస్ అవుతాయని, ‘SSMB 29’కి కూడా అదే బలం ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయ్యింది. ప్రియాంక చోప్రా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. కెన్యాలో మెజారిటీ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జక్కన్న లొకేషన్స్ ని ఫైనల్ చేశారు.
1000 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. జక్కన్న మార్క్ లోనే ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. చాలా రీసెర్చ్ చేసి అన్నిరకాలుగా సిద్ధం ఆయిన తర్వాత రాజమౌళి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. సినిమా షూటింగ్ నుంచి ఎలాంటి లీకులు బయటకి రాకుండా జక్కన్న చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.