Begin typing your search above and press return to search.

'మా'కు గౌరవం రక్షణ అవసరం..!

బీఆర్ఎస్ నేత కేటీఆర్ ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ నాగ చైతన్య, సమంత, అక్కినేని ఫ్యామిలీని ప్రస్తావిచడం తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Oct 2024 6:49 AM GMT
మాకు గౌరవం రక్షణ అవసరం..!
X

బీఆర్ఎస్ నేత కేటీఆర్ ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ నాగ చైతన్య, సమంత, అక్కినేని ఫ్యామిలీని ప్రస్తావిచడం తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఐతే కొండా సురేఖ వ్యాఖ్యలపై సినిమా పరిశ్రమ నుంచి భారీ స్పందన వస్తుంది. మీకు బాధ్యతాయుతమైన పదవులు ఇచ్చింది ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాదని సినీ హీరోలు స్పందించారు.


ఐతే ఈ విషయంపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తరచు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు. ఈమధ్య జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల కారణంగా సినిమా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావిస్తున్నా.. మా పరిశ్రమ ఇతర రంగాల మాదిరిగానే గౌరవం, నమ్మకంతో ముందుకు నడుస్తుంది. కానీ కొందరు రాజకీయ లాభాల కోసం అవాస్తవ కథనాలను వాడుతున్నారని అన్నారు. నటులుగా మేం ప్రజల దృష్టిలో ఉంటాం. మా కుటుంబాలు వ్యక్తిగతం. అందరి ఫ్యామిలీల్లానే మాకు కూడా గౌరవం, రక్షణ అవసరం అని అన్నారు.

ఫ్యామిలీస్ ను టార్గెట్ చేయడం లేదా వ్యక్తిగత జీవితాల మీద అబద్ధపు ఆరోపణలు రావడం ఇష్టపడరు. మేము కూడా మా కుటుంబాలకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం అని మంచు విష్ణు అన్నారు. రాజకీయ నాయక్లు, దానికి సంబంధించిన వ్యక్తులకు తాను విజ్ఞప్తి చేస్తున్నా.. దయచేసి లాంటి రాజకీయ కథనాల కోసం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మా నటీనటులు వారి కుటుంబాల పేర్లని వాడొద్దని అన్నారు.

మేమంతా ప్రజల వినోదం కోసం కష్టపడుతున్నాం. మా వ్యక్తిగత జీవితాలను ప్రజల చర్చల్లోకి తీసుకు రావొద్దు. మనందరం ఒకరినొకరు గౌరవించుకోవాలని అన్నారు. మా చిత్ర పరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూసినా తాను మౌనంగా ఉండను. ఇలాంటి దాడులు సహించేది లేదు. మేమంతా ఏకమై నిలబడతామని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు మా అధ్యక్షుడు మంచు విష్ణు.

సమంత, చైతన్య డైవర్స్ ఇంకా నాగార్జునల మీద కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై వెంకటేష్, అల్లు అర్జున్, మంచు లక్ష్మి స్పందించారు. వ్యక్తిగత ప్రైవసీని రాజకీయ నాయకులు భంగం కలిగించకూడదని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తెలుగు కల్చర్ ని పాడు చేస్తాయని వారు తమ సోషల్ మీడియా ఖాతాల్లో రాసుకొచ్చారు.