Begin typing your search above and press return to search.

కావాలనే టార్గెట్ చేశారు.. చర్యలు తీసుకోవాలి: విశ్వక్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Jun 2024 6:20 AM GMT
కావాలనే టార్గెట్ చేశారు.. చర్యలు తీసుకోవాలి: విశ్వక్
X

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ అందుకుంది. ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు రాబట్టిన ఈ మూవీకి బుక్ మై షో యాప్ లో కొందరు కావాలనే 1 రేటింగ్ ఇస్తున్నారు. దీంతో ఈ విషయంపై విశ్వక్ సేన్.. డైరెక్టర్ తో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

"బుక్ మై షో నిర్వాహకులు ఓ విషయాన్ని కన్సిడర్ చేయాలి. మూవీ షో అయ్యాక సినిమా ఎలా ఉందో రేటింగ్ ఇవ్వమని అడుగుతుంది. కానీ బాట్స్ కు బుక్ మై షో అప్లికేషన్ ఎలా పర్మిషన్ ఇస్తుందో తెలియడం లేదు. చాలా మంది వేల సంఖ్యలో 1 రేటింగ్ ఇస్తున్నారు. సినిమా చూసినవాళ్లు 9.8, 9.5 ఇస్తున్నారు. కానీ యావరేజ్ టాలీ చేసినప్పుడు రేటింగ్ తక్కువ చూపిస్తుంది. మీ ఫోన్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపై క్లిక్ చేస్తే ఎంత మంది 1 ఇచ్చారో తెలుస్తుంది. అది చూశాక.. చిన్న పిల్లలు కూడా బాట్స్ అని చెప్పొచ్చు" అని చెప్పారు.

"టార్గెట్ చేసుకుని మరీ చేస్తున్నా.. ఒకసారి ప్రజలకు బాట్స్ అని తెలిసిపోతే నమ్మకం పోతుంది. రెండో సినిమా కనుక అందరికీ అర్థమైపోయింటుంది. అలా చేస్తున్న వారు ఎవరో తెలియదు. ఎవరో కావాలని మాత్రం చేస్తున్నారు. ఇలా చేసినా నా వల్ల ప్రొడ్యూసర్లు ఎవరూ నష్టపోరు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఏదేమైనా టికెట్ కొన్న వారికే రేటింగ్ ఇచ్చేలా బుక్ మై షో చర్యలు తీసుకోవాలి" అని విశ్వక్ సేన్ సూచించారు.

అయితే విశ్వక్ సేన్ గామి మూవీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. దీంతో అప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ విషయంలో కూడా జరగడం గమనార్హం. ఇక తన ఒకే లాంటి పాత్రల్లో నటించాలంటే బోర్ కొడుతుందని మాస్ కా దాస్ తెలిపారు. సవాల్ విసిరే క్యారెక్టర్లను మాత్రమే తాను సెలెక్ట్ చేసుకుంటానని చెప్పారు.

మరోవైపు, హైదరాబాద్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చూశారు. ఆ తర్వాత మూవీ టీమ్ ను అభినందించారు. అయితే సినిమా చాలా బాగుందంటూ బాలయ్య ఇచ్చిన ప్రశంస మర్చిపోలేనని డైరెక్టర్ కృష్ణ చైతన్య తెలిపారు. సెకండాఫ్‌ గురించి మహిళలు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారని, చాలా ఎమోషనల్‌ గా ఉందని చెబుతున్నారని అన్నారు. మరి మీరు ఈ సినిమా చూశారా? లేదా?