Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్ రిజల్ట్.. నిర్మాత విశ్వప్రసాద్ ఏమన్నారంటే?

సినిమా క్లిక్ అవ్వకపోవడంతో హరీష్ శంకర్ దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 5:38 PM GMT
మిస్టర్ బచ్చన్ రిజల్ట్.. నిర్మాత విశ్వప్రసాద్ ఏమన్నారంటే?
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ మూవీ.. ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ అయింది. విడుదలకు ముందు ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొల్పిన మిస్టర్ బచ్చన్ చిత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో రవితేజ కెరీర్ లో మరో ఫ్లాప్ చేరింది. సినిమా క్లిక్ అవ్వకపోవడంతో హరీష్ శంకర్ దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు.

అయితే మిస్టర్ బచ్చన్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా మిస్టర్ బచ్చన్ రిజల్ట్ పై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సినిమాలో తప్పులను నేరుగా ఒప్పుకున్నారు. స్క్రిప్ట్, సాంగ్స్ అండ్ ప్రమోషన్స్.. అలా అన్ని విషయాలపై మాట్లాడారు. సెకండాఫ్ వల్ల సినిమా ఫ్లాప్ అయిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఆయన చెప్పారంటే?

ఇంటర్వ్యూలో భాగంగా మనమే సినిమా విషయం కోసం మాట్లాడారు. ఓ చీటర్ వల్ల మోసపోయామని, ప్రస్తుతం ఆ విషయం న్యాయ స్థానంలో ఉందని తెలిపారు. మంచి చిత్రమే గానీ తాము నష్టపోయామని చెప్పారు. అనంతరం.. మిస్టర్ బచ్చన్ కోసం హోస్ట్ అడగ్గా.. ఆ సినిమా థియేటర్లలో నడుస్తోందని అన్నారు. ఇప్పుడు మూవీ కోసం మాట్లాడడం కరెక్ట్ కాదని తెలిపారు. కానీ హోస్ట్ పట్టుబట్టడంతో సినిమా ఫ్లాపు అవ్వడానికి కారణాలు ఎక్స్ప్లెయిన్ చేశారు విశ్వప్రసాద్.

సినిమా స్క్రిప్ట్ బలంగా లేదని తనకు తెలుసునని విశ్వ ప్రసాద్ అన్నారు. రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్‌ లో వచ్చిన చిత్రానికి తగ్గట్లు స్క్రిప్ట్ లేదని తెలిపారు. స్క్రిప్ట్ లో లోపాలు ఉన్నాయని, కొన్ని లాజిక్ లు మిస్ అవ్వడమే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని తెలిపారు. ఓవరాల్ గా మంచి మూవీ అని చెప్పారు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుందని, కానీ సెకండాఫ్ మాత్రం బెడిసి కొట్టిందని పేర్కొన్నారు. దాని వెనుక అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు.

అయితే ట్రిమ్ చేసిన వెర్షన్ ను ప్రస్తుతం ప్లే చేస్తున్నామని చెప్పారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలిపారు. హిందీ సాంగ్ వల్ల కూడా నష్టం జరిగిందన్నారు. రిలీజ్ కు ముందు అనవసరంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి గబ్బు పట్టించారని కామెంట్ చేశారు. అవి సినిమాపై భారీగా నెగిటివ్ ప్రభావం చూపించాయని అన్నారు. కాగా, ఇంటర్వ్యూలు ఇచ్చింది హరీష్ శంకరేగా అని హోస్ట్ అన్నారు. లాంగ్ వీకెండ్ లో కమర్షియల్ గా మూవీ ఎంటర్టైన్ చేసిందని విశ్వప్రసాద్ తెలిపారు.