Begin typing your search above and press return to search.

వివి.వినాయక్ ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు?

వివి వినాయక్ పూర్తిగా ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తున్నారు అని, అందుకే ప్రస్తుతం అతను ఇంటికే పరిమితం అయ్యారంటూ జోరుగా కథనాలు ప్రచారం అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   30 May 2024 6:28 AM GMT
వివి.వినాయక్ ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు?
X

టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న స్టార్ దర్శకుడు వివి వినాయక్. ఆది సినిమాతో దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన వినాయక్ స్టార్ హీరోలు అందరితో ఇంచుమించు సినిమాలు చేశారు. మేగ్జిమమ్ వినాయక్ నుంచి వచ్చిన మూవీస్ అన్ని కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కమర్షియల్ చిత్రాలే కావడం విశేషం. మెగాస్టార్ తో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 లాంటి మంచి కాన్సెప్ట్ సినిమాలు కూడా చేశారు.

ఇక తెలుగులో చివరగా సాయి ధరమ్ తేజ్ తో ఇంటిలిజెంట్ అనే సినిమా చేయగా గత ఏడాది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో ఛత్రపతి రీమేక్ చేశారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. తరువాత ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సినిమా రాలేదు. అదుర్స్ 2 చేస్తారనే ప్రచారం నడిచింది. కానీ అది సాధ్యం అయ్యే అవకాశాలు లేవు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి వివి వినాయక్ కి అవకాశం ఇచ్చారంటూ కథనాలు వినిపించాయి. అవి వాస్తవ రూపం దాల్చలేదు. ఇక బాలకృష్ణ తో కూడా మధ్యలో కొన్ని కథలపై చర్చలు జరిగినప్పటికీ అవి సెట్ కాలేదు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా వివి వినాయక్ బయట కనిపించడం లేదు. సినిమా ఈవెంట్స్ లలో కూడా పాల్గొనడం లేదు.

దీంతో వినాయక్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దీనిపై మీడియా సర్కిల్ లో రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. వివి వినాయక్ పూర్తిగా ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తున్నారు అని, అందుకే ప్రస్తుతం అతను ఇంటికే పరిమితం అయ్యారంటూ జోరుగా కథనాలు ప్రచారం అవుతున్నాయి. అలాగే హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్లు రకరకాలుగా కథనాలు వస్తున్నాయి.

గతంలో దిల్ రాజు బ్యానర్ లో వివి వినాయక్ హీరోగా శీనయ్య అనే మూవీని స్టార్ట్ చేశారు. ఆ సినిమా కోసం వినాయక్ స్లిమ్ అయ్యారు. కొంత షూటింగ్ కూడా అయ్యింది. ఎందుకనో ఆ మూవీ అర్ధాంతరంగా ఆగిపోయింది. దిల్ రాజు కూడా పూర్తిగా శీనయ్య మూవీ గురించి మరిచిపోయారు. తరువాత వినాయక్ ఛత్రపతి హిందీ రీమేక్ తో బిజీ అయ్యారు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి వినాయక్ పూర్తిగా మీడియాకి దూరంగా ఉన్నారు.

ఆయన పై సోషల్ మీడియాలో భిన్నమైన ప్రచారాలు నడుస్తూ ఉండటంతో వినాయక్ అభిమానులు ఆయన కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు. మళ్ళీ వినాయక్ మునుపటిలా సినిమాలతో బిజీ కావాలని కోరుకుంటున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాలి.