Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్, ఎవడు.. సేమ్ అలాగే జరుగుతోందా?

క్రిస్మస్ కానుకగా మూవీ రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తుండగా.. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.

By:  Tupaki Desk   |   6 Oct 2024 4:54 PM GMT
గేమ్ ఛేంజర్, ఎవడు.. సేమ్ అలాగే జరుగుతోందా?
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలు పెట్టుకున్నారు. మూడేళ్లుగా షూటింగ్ జరుగుతుండగా.. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. క్రిస్మస్ కానుకగా మూవీ రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తుండగా.. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.

గేమ్ ఛేంజర్ లో చరణ్ సరసన కియారా అడ్వానీ నటిస్తుండగా.. మరో హీరోయిన్ గా అంజలి యాక్ట్ చేస్తున్నారు. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్ వంటి ప్రముఖ నటీనటులు మూవీలో భాగమయ్యారు. కొద్ది రోజులుగా మేకర్స్ వరుస అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అవ్వగా.. మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. త్వరలో టీజర్ ను విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పుడు ఓ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

గేమ్ ఛేంజర్ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చరణ్ తో దిల్ రాజు ఎవడు సినిమా తీశారు. అయితే గేమ్ ఛేంజర్, ఎవడు చిత్రాల విషయంలో ఒకే లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు ఇప్పుడు నెటిజన్లు చెబుతున్నారు. అప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఎవడు సినిమా బడ్జెట్ అనుకోకుండా పెరిగింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్.. బడ్జెట్ బాగా పెరిగిపోయినట్లు తెలుస్తోందని అంటున్నారు.

అప్పుడు ఎవడు.. కొన్ని కారణాల వల్ల ఆరు నెలలు ఆలస్యంగా రిలీజ్ అయింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా ఆలస్యమవుతూ వస్తుంది. డిసెంబర్ 20న గేమ్ ఛేంజర్ విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ పుష్ప-2, ముఫాసా వంటి పెద్ద సినిమాలు అదే నెలలో ప్రేక్షకుల ముందుకు రావడంతో గేమ్ ఛేంజర్ పోస్ట్ పోన్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎవడు మూవీని దిల్ రాజు అప్పుడు డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు.

కానీ అప్పుడు కుదరక.. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా పెద్ద పండుగకు రిలీజ్ చేయనున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎవడు మూవీ డీసెంట్ హిట్ గా నిలిచి.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ చిత్రం విషయంలో ఏం జరుగుతుందోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ఎవడు మూవీ లాగానే గేమ్ ఛేంజర్ విషయంలో అన్నీ రిపీట్ అవుతాయో లేదో చూడాలి.