Begin typing your search above and press return to search.

సూర్య 'కంగువా' ఆ మార్క్‌ క్రాస్ చేసేనా?

ఆ మధ్య వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌ వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందని అంతా భావించారు.

By:  Tupaki Desk   |   6 Oct 2024 3:12 AM GMT
సూర్య కంగువా ఆ మార్క్‌ క్రాస్ చేసేనా?
X

టాలీవుడ్‌ లో బాహుబలి మొదలుకుని మొన్న వచ్చిన కల్కి సినిమా వరకు ఎన్నో పలు సినిమాలు వెయ్యి కోట్లు, అంతకు మించి వసూళ్లు నమోదు చేశాయి. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలు సునాయాసంగా రూ.500 కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. కానీ కోలీవుడ్‌ లో మాత్రం ఆ స్థాయి సినిమాలు రావడం లేదు. ఇప్పటి వరకు కోలీవుడ్‌ లో ఒక్క వెయ్యి కోట్ల సినిమా రాలేదు. దాంతో తమిళ సినీ ప్రేమికులు, మీడియా వర్గాల వారు, ఇండస్ట్రీ వర్గాల వారు అంతా ఎప్పుడెప్పుడు వెయ్యి కోట్ల సినిమా వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో వచ్చిన ప్రతి సినిమా అంతంత మాత్రంగానే వసూళ్లు రాబడుతున్నాయి.

ఆ మధ్య వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌ వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఆ సినిమాకు అంత సీన్‌ లేదని తేలిపోయింది. అయితే కంగువా సినిమా కచ్చితంగా వెయ్యి కోట్ల సినిమా అంటూ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు ధీమాగా ఉన్నారు. అందుకు కారణం ఇప్పటికే సినిమాకు భారీ క్రేజ్ క్రియేట్‌ అయింది. అంతే కాకుండా సినిమా అయిదు కాదు పది కాదు ఏకంగా 38 భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అందుకే ఈ సినిమా ఈజీగా వెయ్యి కోట్లు వసూళ్లు చేస్తుందనే నమ్మకం ను ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు సూర్య ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

యాక్షన్‌ సినిమాల దర్శకుడిగా పేరు దక్కించుకుని స్టార్‌ హీరోలకు ఎన్నో హిట్స్ ఇచ్చిన శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఎట్టకేలకు సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అయింది. మొన్నటి వరకు దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల చేయాలని భావించారు. కానీ నవంబర్‌ 14 కి సినిమాను వాయిదా వేయడం జరిగింది. దసరా కానుకగా అదే తేదీన రజనీకాంత్ వేట్టయాన్ సినిమా విడుదల అవ్వబోతుంది. అందుకే కంగువా వాయిదా వేయడం జరిగింది.

ఎంత ఆలస్యంగా వచ్చినా సినిమా వెయ్యి కోట్ల మార్క్ క్రాస్‌ చేస్తే చాలు అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళ బాహుబలి అంటూ కంగువాను అక్కడి మీడియా పిలుస్తోంది. కనుక సినిమా కు ఆ స్థాయి స్పందన వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. రికార్డ్‌ స్థాయి వసూళ్లను రాబట్టడం కోసం సినిమా ను అత్యధిక థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. అదే జరిగితే సినిమా విడుదల రోజే అత్యధిక వసూళ్లు సాధించి అరుదైన రికార్డ్‌ ను సొంతం చేసుకోవచ్చు. యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. దిశా పటానీ హీరోయిన్‌ గా నటించిన విషయం తెలసిందే.