Begin typing your search above and press return to search.

ప్రభాస్‌‌నే వద్దన్న స్టార్ హీరోయిన్?

ఇందులో భాగంగానే వరుసగా పాన్ ఇండియా రేంజ్ చిత్రాల్లోనే నటిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 11:30 PM GMT
ప్రభాస్‌‌నే వద్దన్న స్టార్ హీరోయిన్?
X

తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసేసిన హీరోల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అతడు.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా ఇండియన్ సినిమాను శాసించే దిశగా సాగిపోతున్నాడు. ఇందులో భాగంగానే వరుసగా పాన్ ఇండియా రేంజ్ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో భారీ చిత్రాలతో వచ్చి అలరించాడు.


రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే పలు సినిమాలను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సీరియస్ పోలీస్ స్టోరీతో రూపొందబోతుంది. ఎంతో వైల్డ్ కంటెంట్‌తో క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ, ఇప్పటి వరకూ షూటింగ్‌పై ఎలాంటి క్లారిటీ లభించలేదు.

‘స్పిరిట్’ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి కొత్త అప్‌డేట్ లేకున్నా.. ఇందులో ఫలానా పాన్ ఇండియా స్టార్ నటిస్తున్నారని మాత్రం ప్రచారం జరుగుతూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి చాలా రకాల పుకార్లు తెరపైకి వచ్చాయి. అందులో భాగంగానే ఈ సినిమాలో లేడీ విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటిస్తుందని కూడా ఓ న్యూస్ సెన్సేషన్ అయింది.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందనున్న ‘స్పిరిట్‌’ సినిమాలో కరీనా కపూర్ నటిస్తుందని వార్తలు వచ్చిన నేపథ్యంలోనే.. ఇప్పుడు ఆమె ఈ మూవీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు ప్రచారం మొదలైంది. గతంలో ఆమె కన్నడ స్టార్ హీరో యశ్ ‘టాక్సిక్’ సినిమాను కూడా తిరస్కరించినట్లు టాక్ వచ్చింది. ఇప్పుడు ప్రభాస్‌తో నటించడానికి కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదన్న వార్త రావడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

‘స్పిరిట్’ మూవీని రిజెక్ట్ చేసినట్లు వస్తున్న న్యూస్‌పై తాజాగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ స్పందించింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నేను ప్రభాస్ స్పిరిట్ మూవీని తిరస్కరించానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. వాళ్లు ఇప్పటి వరకూ నాతో సంప్రదించలేదు కూడా. ఒకవేళ సౌత్ నుంచి నన్ను మెప్పించే కథతో ఎవరైనా వస్తే కచ్చితం నటిస్తాను’ అంటూ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది.

ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ మూవీని ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు కూడా తెలిసింది. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషన్ కుమార్ నిర్మిస్తున్నారు.