Begin typing your search above and press return to search.

పుష్ప 2, గేమ్​ ఛేంజర్​.. అప్పుడు కూడా డౌటే

ఈ ఏడాది మరో మూడు నెలల్లో ముగిసిపోనుంది. పాన్ ఇండియా బాక్సాఫీస్​ ముందు తెలుగు హీరోల్లో ప్రభాస్​ ఒక్కడే సలార్​తో సందడి చేసే అవకాశం ఉంటుంది.

By:  Tupaki Desk   |   11 Sep 2023 4:00 AM GMT
పుష్ప 2, గేమ్​ ఛేంజర్​.. అప్పుడు కూడా డౌటే
X

ఈ ఏడాది మరో మూడు నెలల్లో ముగిసిపోనుంది. పాన్ ఇండియా బాక్సాఫీస్​ ముందు తెలుగు హీరోల్లో ప్రభాస్​ ఒక్కడే సలార్​తో సందడి చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఆ చిత్రం కూడా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవ్వొచ్చు. అయితే వచ్చే ఏడాది 2024 మాత్రం అలా కాదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్​, యంగ్ టైగర్ ఎన్టీఆర్​, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్​ ఇలా అందరీ హీరోల వరుస సినిమాలు ఆడియెన్స్​ను అలరించేందుకు రెడీగా అవుతున్నాయి.

అయితే ఈ హీరోల్లో అల్లు అర్జున్ పుష్ప 2, రామ్​ చరణ్​ గేమ్​ ఛేంజర్ రిలీజ్ డేట్స్​పై సందిగ్ధత నెలకొంది. ఈ చిత్రాలన్ని వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేసే అవకాశముందని మొన్నటి వరకు ప్రచారం సాగింది. కానీ ఇప్పుడా పరిస్థితి కనపడట్లేదు. అల్లు అర్జున్​ పుష్ప 2ను సమ్మర్ కన్నా ముందే మార్చి చివర్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట.

అలానే గేమ్​ ఛేంజర్​ రిలీజ్​ డేట్​పై మరింత సస్పెన్స్​ నెలకొంది. ఈ చిత్రాన్ని దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈయన ఈ చిత్రంతో పాటు కమల్​ హాసన్​తో ఇండియన్ 2 కూడా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పంద్రాగస్ట్​న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా రిలీజయ్యాకే గేమ్​ ఛేంజర్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీటీమ్ అనుకుంటోందట. అంటే ఈ లెక్కన ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో వచ్చే అవకాశముంటుంది. లేదంటే చెప్పలేం ఎప్పుడు వస్తుందో.. చూడాలి మరి ఏం జరుగుతుందో..

పుష్ప 2 షూటింగ్ విషయానికొస్తే.. షెడ్యూల్స్​ కాస్త ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. తొలి భాగానికి వచ్చిన రెస్పాన్స్​ నేపథ్యంలో రెండో భాగాన్ని దర్శకుడు సుకుమార్​ మరింత జాగ్రత్తగా గ్రాండ్​గా తెరకెక్కిస్తున్నారు. కాస్త లేటైనా ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరిస్తున్నారట. ఇప్పటివరకు 1/3 షూటింగ్​ జరిగిందని తెలిసింది. మిగతా భాగం చిత్రీకరణ పూర్తి చేసుకోవడానికి మరింత సమయం పడుతుంది. ఒకవేళ ఈ చిత్రం వచ్చే ఏడాదికి పూర్తి కాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇక గేమ్​ ఛేంజర్​ విషయానికొస్తే.. ఈ చిత్ర షూటింగ్​ ఎంత వరకు కంప్లీట్ అయిందో ఇంకా ఎటువంటి వివరాలు తెలియలేదు. ఆ మధ్యలో ఈ చిత్ర నిర్మాత దిల్​రాజును అడిగితే తనకేం సంబంధం లేదని అంతా శంకరే చూసుకుంటున్నారని చెప్పారు. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది.