Begin typing your search above and press return to search.

వైసీపీ ఓట‌మి.. అంబ‌టి రాయుడు స‌న్సేష‌న‌ల్ ట్వీట్‌!

ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న కౌంటింగ్.. ఫ‌లితం దాదాపు వైసీపీకి ప‌రాజ‌యం అందించేసింది.

By:  Tupaki Desk   |   4 Jun 2024 6:59 AM GMT
వైసీపీ ఓట‌మి.. అంబ‌టి రాయుడు స‌న్సేష‌న‌ల్ ట్వీట్‌!
X

ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న కౌంటింగ్.. ఫ‌లితం దాదాపు వైసీపీకి ప‌రాజ‌యం అందించేసింది. విజ యం ఖాయ‌మ‌ని ఆశ్చ‌ర్య పోతార‌ని చెప్పిన సీఎం జ‌గ‌న్.. ఇప్పుడు ఆయ‌నే ఆశ్చ‌ర్య పోవ‌డం ఖాయ‌మైం ది. అయితే.. ఇలాంటి కీలక స‌మ‌యంలో టీం ఇండియా మాజీ క్రికెట‌ర్‌.. అంబ‌టి రాయుడు ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన కూట‌మి విజ‌యం దిశ‌గా అడుగులు వేయ‌డంపై ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు.

‘ఇది ఏపీ ప్రజల గొప్ప విజయం. ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు అభినందనలు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జట్టు కట్టారు. ఏపీకి మంచి రోజులు రాబోతు న్నాయి. ఈ అఖండ విజయంతో నారా లోకేష్ పాదయాత్ర కీలక పాత్ర పోషించింది’ అని రాయుడు ట్వీట్ చేశారు. మ‌రోవైపు.. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ కూడా.. ఏపీ ఫ‌లితంపై నిశితంగా గ‌మ‌నించారు.

ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం వ‌స్తున్న ట్రెండ్‌ను వైసీపీనాయ‌కులు కూడా నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. మంచి జ‌రిగితేనే ఓట్లే వేయాల‌న్న పిలుపు త‌మ‌కు లాభిస్తుంద‌ని పార్టీ అంచ‌నా వేసింది. అంతేకాదు.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ త‌మ‌కు అనుకూలంగా మారుతుంద‌ని అనుకున్నారు. కానీ.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ కూడా బెడిసి కొట్టింది. ఇంటింటికీ ఇచ్చిన సంక్షేమం.. కానీ.. మ‌హిళ‌ల‌కు ఇచ్చిన స్థలాలు కానీ.. ఎక్క‌డా వైసీపీకి మేలు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదే.. ఇప్పుడు వైసీపీని అంత‌ర్మ‌థ‌నంలో ప‌డేసింది.