Begin typing your search above and press return to search.

ఆమెను ముక్కలుముక్కలుగా నరికినోడు సూసైడ్ చేసుకున్నాడు

మహాలక్ష్మిని దారుణంగా హత్య చేసిన నిందితుడు ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఒక చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు.

By:  Tupaki Desk   |   26 Sep 2024 4:18 AM GMT
ఆమెను ముక్కలుముక్కలుగా నరికినోడు సూసైడ్ చేసుకున్నాడు
X

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బెంగళూరు మహిళ దారుణ హత్యకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. మహలక్ష్మీ అనే 29 ఏళ్ల యువతిని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచిన వైనం వెలుగు చూడటం.. దీనికి కారణమైన వ్యక్తి కోసం పోలీసులు పెద్ద ఎత్తున వెతుకుతున్న వైనం తెలిసిందే. ఇలాంటి వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

మహాలక్ష్మిని దారుణంగా హత్య చేసిన నిందితుడు ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఒక చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితుడు ‘‘సడోమా సూకిస్ట్ క్ట్’’ అనే నేర స్వభావంతో రగిలిపోయినట్లుగా వైద్య నిపుణులు గుర్తించారు. సదరు వ్యక్తిని వెంటనే పట్టుకోకపోతే.. మరిన్ని కిరాతకాలు చోటు చేసుకునే వీలుంటుందన్న విషయాన్ని వెల్లడించారు. అతడు ఎక్కడున్నా వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకోవాలన్న హెచ్చరిక జారీ అయ్యింది.

మహలక్ష్మిని దారుణంగా నరికిన ఉదంతంలో ఆమెను 30 ముక్కలుగా నరికినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే.. వైద్య పరీక్షలో ఆమెను 59 ముక్కలుగా నరికినట్లుగా గుర్తించారు. తలనే మూడు ముక్కలుగా పగులగొట్టిన వైనాన్ని గుర్తించి షాక్ తిన్నారు. ఆమె ప్రతి శరీర భాగాన్నీ నరికే టైంలో ఆనందం పొందాడన్న అనుమానం వ్యక్తమైంది. ‘‘సడోమా సూకిస్ట్ క్ట్’’ లక్షణాలతో ఉన్న వారే ఈ తరహా నేరాలకు పాల్పడతారని పేర్కొంటున్నారు.

ఈ హత్య వెనుక ఒకరు కాదని.. ఇద్దరు ముగ్గురు ఉండి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమికంగా లభించిన సమాచారం ప్రకారం బట్టల షాపులో పని చేసే ఆమె.. ఒక వ్యక్తితో పరిచయమై.. ప్రేమగా మారింది. ఆర్నెల్ల క్రితం వారిద్దరు విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల్లేవు. తనతో కావాలనే దూరంగా ఉంటుందని దుండగుడు భావించి.. గొడవ పడినట్లుగా గుర్తించారు. అయితే.. హత్యకు పాల్పడిన వ్యక్తి ఎవరన్నకోణంలో విచారణ సాగింది.

ఇదిలా ఉండగా.. బాధితురాలికి ఉన్న ముఖ్యమైన ముగ్గురు ఫ్రెండ్స్ లో ముక్తి రంజన్ రాయ్ మీదనే అనుమానాలు ఉన్నాయి. అతడే ఆమెను దారుణంగా హత్య చేసి ఉంటాడని గుర్తించారు. తాజాగా అతను ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు.