Begin typing your search above and press return to search.

ఆనంద్ మహీంద్రా మనసు దోచిన గిరిజనుడు

'మ‌న‌ల్ని ఎవ‌రు ప‌రిపాలించాలో నిర్ణ‌యించుకునే అవ‌కాశం. ఇది ఒక బ్లెస్సింగ్.

By:  Tupaki Desk   |   21 May 2024 10:11 AM GMT
ఆనంద్ మహీంద్రా మనసు దోచిన గిరిజనుడు
X

'మ‌న‌ల్ని ఎవ‌రు ప‌రిపాలించాలో నిర్ణ‌యించుకునే అవ‌కాశం. ఇది ఒక బ్లెస్సింగ్. ఈ బ్లెస్సింగ్‌ను మీరు ఎట్టిప‌రిస్థితుల్లోనూ పోగొట్టుకోవ‌ద్దు' అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మ‌హీంద్రా చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది.

సోషల్ మీడియాలో ఉత్సాహంగా ఉండే ఆనంద్ మహీంద్రా నిన్న ఐదో విడతలో తన ఓటు వినియోగించుకున్న తర్వాత 'ఎక్స్' వేదికగా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మొద‌టిసారి ఓటు వేసిన గిరిజ‌నుడి ఫొటోను ఆయ‌న నెటిజ‌న్ల‌తో పంచుకున్నారు. త‌న వ‌ర‌కు 2024 ఎన్నిక‌ల్లో బెస్ట్ ఫొటో ఇదేనని కొనియాడారు.

గ్రేట్ నికోబార్ ద్వీపంలోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో నివ‌సించే షోంపెన్ తెగ‌కు చెందిన ఏడుగురిలో ఒక‌రు మొద‌టిసారి ఓటేశారు. ఆ ఫోటోను షేర్ చేస్తూ మహీంద్రా ‘ప్ర‌జాస్వామ్యానికి ఎదురులేదు. తిరుగులేని శ‌క్తి’ ఆనంద్ మ‌హీంద్రా పోస్ట్ చేశారు.