Begin typing your search above and press return to search.

అమ్మకు అగ్గి పెట్టేశాడు.. పోలీస్ స్టేషన్ లో షాకింగ్ సీన్!

కన్నతల్లి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిన ఈ దారుణ ఉదంతంలోకి వెళితే..

By:  Tupaki Desk   |   17 July 2024 12:30 PM GMT
అమ్మకు అగ్గి పెట్టేశాడు.. పోలీస్ స్టేషన్ లో షాకింగ్ సీన్!
X

అమానవీయ ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. జన్మనిచ్చిన తల్లిని పోలీస్ స్టేషన్ లోనే నిప్పు పెట్టిన కొడుకు వైనం విన్నంతనే షాకింగ్ గా మారుతుంది. అంతేనా.. మంట చుట్టుముట్టేసి ఆర్తనాదాలను చేస్తుంటే తన ఫోన్ లో రికార్డు చేసిన ఈ రాక్షసుడికి ఎలాంటి శిక్ష విధించినా తక్కువే అవుతుంది. కన్నతల్లి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిన ఈ దారుణ ఉదంతంలోకి వెళితే..

ఇంటికి సంబంధించి భూవివాదం నేపథ్యంలో గౌరవ్ అనే వ్యక్తి తన తల్లి.. ఇతర బంధువులతో కలిసి ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ ప్రాంతంలోని ఖైర్ పోలీస్ స్టేసన్ కు వచ్చారు. ఈ క్రమంలో తన కొడుకు గౌరవ్ పై తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే సమయంలో ఇరువురు తమ బంధువులతో కలిసి వివాదాన్ని సెటిల్ చేసుకునే ప్రయత్నం చేశారు.

ఎంతకూ తల్లి కొడుకుల మధ్యనున్న వివాదం ఒక కొలిక్కి రాకపోవటంతో విసుగు చెందిన తల్లి.. తనతో తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటి మీద పోసుకొని సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది. అంతలో అక్కడున్న పోలీసులు స్పందించి ఆమె చేతిలో ఉన్న లైటర్ ను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లైటర్ కింద పడింది.

అంతలో అక్కడే ఉన్న గౌరవ్ లైటర్ అందుకొని తల్లికి నిప్పు అంటించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటల్లో విలవిలలాడుతున్న తల్లిని తన ఫోన్ లో వీడియో చిత్రీకరించిన వైనం అక్కడి వారిని షాక్ కు గురి చేసింది. మంటలు పెద్దవి కావటంతో పోలీసులు వెనక్కి తగ్గినప్పటికీ.. ఆ షాక్ నుంచి తేరుకొని మట్టి.. గోనె సంచులతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు.

ఆ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె ఒంటిపై 40 శాతం గాయాలు అయినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఆమెను కాపాడే ప్రయత్నం చేసిన వైద్యులు ఫెయిల్ అయ్యారు. వయసు ఎక్కువగా ఉండటం.. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె మరణించారు. కింద పడిన లైటర్ తో తల్లికి నిప్పు అంటించిన వైనం అక్కడే ఉన్న సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు గౌరవ్ ను అరెస్టు చేశారు. సదరు వీడియోలను కుటుంబ సభ్యులకు చూపించగా.. వారు సైతం షాక్ తిన్నారు. ఈ ఉదంతం యూపీలో సంచలనంగా మారింది.